logo

తెదేపా నాయకులపై వైకాపా దాడి

తెదేపా నాయకులపై వైకాపా నాయకులు దాడి చేసి గాయపరిచిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్‌బాబు కథనం మేరకు..

Published : 30 Mar 2023 02:25 IST

ఇరు వర్గాలపై కేసు నమోదు

పోలీసులతో మాట్లాడుతున్న తెదేపా నాయకులు

వి.కోట, న్యూస్‌టుడే: తెదేపా నాయకులపై వైకాపా నాయకులు దాడి చేసి గాయపరిచిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. సీఐ ప్రసాద్‌బాబు కథనం మేరకు.. స్థానిక భారత్‌ థియేటర్‌ వద్ద ఉన్న ఓ స్థలం విషయమై తమకు మూడు రోజుల క్రింద కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పీఎన్‌ నాగరాజు వర్గం అక్కడి దుకాణాలు తొలగించేందుకు మంగళవారం రాత్రి వెళ్లింది. మరోవైపు ఈ స్థలం తమకు చెందిందని తెదేపా సీనియర్‌ నేత ఎక్బాల్‌ వర్గం అడ్డుపడింది. దీంతో ఇరువర్గాల వారు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా ఘర్షణ చోటుచేసుకుంది.

గాయపడ్డ ఎక్బాల్‌

ఈ దాడుల్లో ఎక్బాల్‌, అతని కుమారుడు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీఎన్‌ నాగరాజు వర్గం తమపై దాడికి పాల్పడి గాయపరిచారని, తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఎక్బాల్‌ వర్గం ధర్నా చేసింది. దీంతో రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చచెప్పి ధర్నా విరమింపజేశారు. ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా పీఎన్‌ నాగరాజు, ఎక్బాల్‌ వర్గాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని