logo

గణనాథుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు.

Published : 31 Mar 2023 02:33 IST

జస్టిస్‌ సుజాతకు స్వామివారి జ్ఞాపిక అందిస్తున్న ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం న్యాయమూర్తి, కుటుంబ సభ్యులకు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు ఏఈవో అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. చిత్తూరు పశ్చిమ సీఐ శ్రీనివాసులురెడ్డి, తహసీల్దార్‌ సుశీల, ఆలయ సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్‌ బాబు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని