పసుపుమయం.. ప్రభంజనం
గోదారమ్మ సైతం చిన్నబోయేలా తూర్పున పసుపు దండు సముద్రాన్ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే సూరీడు ముచ్చెమటలు పట్టిస్తున్నా.. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో రాజమహేంద్రవరం సమీప వేమగిరి వద్ద నిర్వహించిన మహానాడుకు లక్షలాదిగా జనం చేరుకున్నారు.
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్టుడే బృందం
గోదారమ్మ సైతం చిన్నబోయేలా తూర్పున పసుపు దండు సముద్రాన్ని తలపించింది.. ఆదివారం ఉదయం నుంచే సూరీడు ముచ్చెమటలు పట్టిస్తున్నా.. తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో రాజమహేంద్రవరం సమీప వేమగిరి వద్ద నిర్వహించిన మహానాడుకు లక్షలాదిగా జనం చేరుకున్నారు. బహిరంగ సభ సాయంత్రమని ప్రకటించినా.. తెల్లవారుజాము నుంచే తాకిడి మొదలైంది. ముందురోజు జరిగిన ప్రతినిధుల సభలో చంద్రబాబు రాష్ట్ర భవితకు బాటలు వేసేలా.. తెదేపా శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ హుషారు నింపగా, పార్టీ ముఖ్య నేతలు తెదేపా హయాంలో అమలు చేసిన ప్రగతి ఫలాలను వివరించారు. ఇక ఆదివారం నాటి బహిరంగ సభకు వచ్చే దారులన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి. ఓ వైపు సాయంత్రం వర్షం కురుస్తున్నా.. సభా ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్యాలరీల్లోంచి కదల్లేదు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో ర్యాలీగా వచ్చినవారు తడుస్తూనే ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యకర్తల నినాదాలు హోరెత్తాయి. నాయకుల ప్రసంగాలను అంతా శ్రద్ధగా విన్నారు. కాసేపటికే వర్షం తెరిపివ్వడంతో అంతా ఉపశమనం పొందారు. రెట్టించిన ఉత్సాహంతో సభ సాగింది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి లోకేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు ప్రసంగిస్తూ తెదేపా అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు.
ఆరు బృందాలు.. ఆరోగ్య సేవలు
లక్షలాది మంది కొలువుదీరిన మహానాడు బహిరంగ సభలో అత్యవసర వైద్య అవసరానికి అంబులెన్సులతో పాటు ఆరు గ్రూపులుగా వైద్య సిబ్బందితో సేవలు అందించినట్లు తెదేపా వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు. 20 మంది డ్యూటీ డాక్టర్లు, 20 మంది నర్సులు, 10 మంది పారా మెడికల్ సిబ్బంది, ఆరు అడ్వాన్స్డ్ లైఫ్ సర్వీస్ అంబులెన్సులు, ఆరు గ్యాస్ ఆక్సిజన్ అంబులెన్సులు, 10 బెడ్లు (ఆక్సిజన్తో), మరో ఆరు బృందాల వైద్య సిబ్బంది సేవలు అందించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సాగుదారు.. జగన్ హక్కుదారు
[ 02-05-2024]
జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. -
పప్పన్నం లేనట్లే..
[ 02-05-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప. -
పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
[ 02-05-2024]
-
పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
[ 02-05-2024]
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. -
ఎ‘వరి’కి చెప్పుకోవాలో
[ 02-05-2024]
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నాయి జగన్...
[ 02-05-2024]
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. -
కర్రలు, రాళ్లతో వెంటాడి..
[ 02-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. -
మేనిఫెస్టోలో భాజపా చిత్రాలేవి: మంత్రి పెద్దిరెడ్డి
[ 02-05-2024]
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
[ 02-05-2024]
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. -
వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!
[ 02-05-2024]
ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు -
పోలీసులకు ఒక్కరోజే..!
[ 02-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మొదటి రోజు విలపింఛెన్దారులు
[ 02-05-2024]
ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, -
హామీల వలలో మున్సి‘పల్టీలు’
[ 02-05-2024]
ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్