వగరు మిగుల్చుతోన్న మామిడి
జిల్లాలో మామిడి ధరలు ప్రస్తుతం మిడిమిడిగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు, బంగారు పాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని మామిడి కాయల యార్డుల్లో మామిడి వ్యాపారం కాస్తా జోరందుకుంది.
మిడిమిడిగా ధరలు
నష్టపోతున్న రైతులు
చిత్తూరు యార్డుకు వచ్చిన తోతాపురి కాయలు
ఎంతో ఆశతో మామిడి సాగు చేసిన రైతులు తీరా సీజన్ వచ్చాక తీపి కబురు అందుతుందను కుంటే అదికాస్తా వారికి వగరు మిగిల్చింది.. దిగుబడి ఆశించిన మేర రాకున్నా ఉన్నంతలో అందుబాటులో ఉన్న కాయలకు మంచి ధర వస్తుందనుకుంటే రోజురోజుకూ వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి.. యార్డుల్లోని మండీల్లో క్రయవిక్రయాలు ఊపందుకున్నా ధర మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడం మామిడి రైతులకు ఆశనిపాతంగా మారింది.
చిత్తూరు(మిట్టూరు), న్యూస్టుడే: జిల్లాలో మామిడి ధరలు ప్రస్తుతం మిడిమిడిగానే కొనసాగుతున్నాయి. చిత్తూరు, బంగారు పాళ్యం వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని మామిడి కాయల యార్డుల్లో మామిడి వ్యాపారం కాస్తా జోరందుకుంది. ఈ క్రమంలోనే మామిడి గుజ్జు పరిశ్రమలకు కాయల తరలింపు ఊపందు కుంది.
దిగుబడులు తగ్గడం వల్ల ధరలు బాగుంటాయని సంబరపడిన రైతులకి ధరలు పెరగకపో వడం, నిలకడగా, మిడిమిడిగా ధరలు ఉండటంతో రానున్న రోజుల్లో ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? అని తెలియని ఆందోళన స్థితిలో ఉన్నారు. ఏంచేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. కనీసం పెట్టుబడి అయినా వస్తుందా? రాదా? అని సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే చాలా మేర అప్పులు చేసి మామిడిని సాగుచేస్తుంటే ఈ పరిస్థితి తమను మరింత కుంగదీస్తోందని వాపోతున్నారు.
తోతాపురి మామిడి కోతలు ఈ నెల(జూన్) రెండో వారానికి పూర్తిగా ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం తోతాపురి కాయలు టన్ను ధర ర్యాంపుల వద్ద రూ.13-15 వేలు పలుకుతోంది. అదే గుజ్జు పరిశ్రమల వద్ద రూ.13-14 వేలు చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఫలితంగా నష్టాలు తప్పడం లేదని వారు వాపోతున్నారు. జిల్లా అధికారులు.. ఈ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తే తప్ప మామిడికి ఈ ఏడాది మంచి ధర వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. మార్కెట్ యార్డుల్లో మామిడి ధరల వివరాలు ఇలా..
* చిత్తూరు యార్డులో తోతాపురి(కలర్ కాయ) టన్ను ధర రూ.16-20 వేలు, బేన్నీషా రూ.16-24 వేలు, పులేరా రూ.13-20 వేలు.
* బంగారుపాళ్యం యార్డులో.. బేన్నీషా రూ.20-25 వేలు, కాదర్ రూ.35-45వేలు, పులేరా రూ.14-19 వేలు.
కలెక్టర్ ప్రకటించిన ధర ఎక్కడ?
తోతాపురి మామిడి టన్నుకు రూ.19వేలు చెల్లించాలని కలెక్టర్ షన్మోహన్ మే నెల పదో తేదీన గుజ్జుపరిశ్ర మల నిర్వహకులు, రైతులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ప్రకటించారు. అయితే నాటినుంచి నేటి వరకు కనీసం ఒక్కరోజయినా జిల్లాలోని గుజ్జు పరిశ్రమలు తోతాపురికి రూ.19వేలు చెల్లించిన దాఖలాల్లేవు. మామిడి రైతులను ఆదుకోవాలని స్వయంగా కలెక్టర్ చెప్పినా పట్టించుకోకపో వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM