logo

శ్రీవారి సేవలో రామ్‌చరణ్‌ దంపతులు

శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు

Updated : 28 Mar 2024 05:03 IST

క్యూ లైన్లో వెళ్తున్న రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు, కుమార్తె క్లింకార

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో అభిమానులు ఆలయం వద్దకు చేరుకుని తమ అభిమాన హీరోతో ఫొటోలు తీసుకునేందుకు పోటీపడ్డారు. రామ్‌చరణ్‌, ఉపాసన చిత్రాన్ని గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్న వీరాభిమాని రెడ్డిచరణ్‌ అతిథిగృహం వద్ద తమ అభిమాన హీరోని కలుసుకున్నారు. 

  సర్వదర్శనానికి ఎనిమిది గంటలు

 ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా బుధవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు దాదాపు ఎనిమిది గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. మంగళవారం శ్రీవారిని 68,563 మంది దర్శించుకున్నారు. రూ.4.91 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని