చెరబట్టి.. నీరు వెల్లగొట్టి..!
భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి.
వెలవెల బోతున్న చెరువులు
పొంచి ఉన్న తాగునీటి ముప్పు
ఈనాడు-తిరుపతి: భానుడి ప్రతాపంతో ఎండాకాలంలో దాహార్తి తిప్పలు తప్పవని ముందే గుర్తించినా వైకాపా నేతల ఆక్రమణల పర్వంతో జిల్లాలోని అత్యధిక చెరువులు నీరు లేక ఒట్టిపోయాయి. దీనికితోడు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో మిగిలిన చెరువుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం రోడ్డు ఎక్కుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయం గురించి ఆలోచించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.
జిల్లా పరిధిలో అత్యధికంగా యర్రావారిపాలెం మండలంలో ఏకంగా 108 చెరువులు పూర్తిగా అడుగంటాయి. బోడేవాండ్లపల్లె పరిధిలోని 49 చిన్న చెరువుల్లో 16.61 ఎంసీఎఫ్టీలకు 6.19 ఎంసీఎఫ్టీల నీరే ఉంది. 35 చెరువుల్లో 25 శాతం, మరో 2 చెరువులు పూర్తిగా అడుగంటాయి. ఎలమందలో 33 చెరువుల్లో చుక్కనీరు లేదు. కేవీబీపురం మండలంలోని 125 చెరువులకు 1348.57 ఎంసీఎఫ్టీల నీటి నిల్వ సామర్థ్యం కాగా.. 327.59 ఎంసీఎఫ్టీ మాత్రమే ఉంది. వంద చెరువులు అడుగంటాయి. కొవనూరులో 11, పెరిందేశంలో ఆరు చెరువులు అడుగంటాయి.
ఆక్రమణలతో..: వైకాపా అధికారంలోకి వచ్చాక చెరువులు అనేకం ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ మట్టిని తరలించడంతో చెరువుల రూపురేఖలు మారిపోయాయి. పెద్ద పెద్ద గోతులు ఏర్పడటంతో భూముల్లోకి నీరు ఇంకడం లేదు. పరిసరాల్లోని బోర్లు సైతం అడుగంటిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో కాలువలు ఆక్రమించడంతో వర్షాలు కురిసినా నీళ్లు చెరువులకు చేరడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీటి ఆక్రమణలు మరింత పెరిగాయి.
గొలుసుకట్టు.. తీసికట్టు..: రాయలవారి కాలంలో జిల్లాలో పెద్ద ఎత్తున గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. దీనివల్ల ఒక చెరువు నిండిన తర్వాత కాలువల ద్వారా మరో దాంట్లోకి నీరు చేరేవి. ఇప్పుడవి పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. ఎక్కడికక్కడ కాలువల్లో నిర్మాణాలు చేపట్టడంతో గొలుసుకట్టు చెరువులకు నీరు చేరే పరిస్థితి కనిపించడం లేదు.
వర్షాభావ పరిస్థితి..
తుపాను కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా జిల్లాలో సాధారణ వర్షపాతం సైతం నమోదు కాలేదు. గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే జిల్లాలో 1027.39 ఎంఎం సాధారణ వర్షపాతం కాగా 974.07 ఎంఎం మాత్రమే పడింది. ఓజిలిలో 36.21, బాలాయపల్లెలో 35.28, వెంకటగిరిలో 29.12 శాతం, నాయుడుపేటలో 25.89 శాతం అత్యల్ప వర్షపాతం నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
[ 28-04-2024]
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
[ 28-04-2024]
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు
[ 28-04-2024]
తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!