గరం గరం.. పశుగ్రాసం
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు.
ధరలతో హడలిపోతున్న అన్నదాతలు
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
న్యూస్టుడే, బంగారుపాళ్యం
వర్షాలు ఎండమావులయ్యాయి.. చెరువులు, కుంటలు బీటలు వారాయి.. భూగర్భ జలాలు అండుగంటిపోయాయి.. సాగు భూములు బీళ్లుగా మారుతున్నాయి.. ఈ క్రమంలో పశుగ్రాసం కొరత తీవ్రమైంది.. పశుపోషణకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు.. వేసవి వచ్చేయగానే ముందస్తు జాగ్రత్తలతో అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. జిల్లాలో కీలకమైన చిత్తూరు, పూతలపట్టు ప్రాంతాల్లోని పెద్దఎత్తున పశువులు, మేకలు, గొర్రెలు మేత లేక అలమటిస్తున్నాయి.
జిల్లాలో రైతుల ప్రధాన జీవనాధారం పాడిపశువులు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు పాల దిగుబడిపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. నాలుగు నెలలుగా వరుణ దేవుడు కన్నెర్ర చేశాడు. దీనికితోడు రోజురోజుకు ఎండలు తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటాయి. పచ్చిక బయళ్లు కనుమరుగయ్యాయి. మూగజీవులకు మేత కరవు కావడంతో అవి నానా తిప్పలు పడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు తగ్గింది. బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు అడుగంటి పశుగ్రాసం సాగు చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పశుపోషణ భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు వెచ్చించి పశుగ్రాసం కొనుగోలు చేసి పశువులకు మేత వేస్తున్నారు.
చుట్ట గడ్డి.. రూ.210
పశుగ్రాసం కొరత తీవ్రం కావడంతో వరి ధరలు అధికమయ్యాయి. చుట్ట ఎండు వరి గడ్డి ధర రూ.210 పలుకుతోంది. దీంతో దీన్ని కొనుగోలు చేసి పశువులకు మేత వేస్తున్నారు. పశువుల పౌష్టికాహారమైన గానుగ పిండి, పశువుల దాణా ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదే సమయంలో పాల ధర మాత్రం పెరగలేదని రైతులు వాపోతున్నారు. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సరిహద్దు తమిళనాడు ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, ఇతరత్రా వాహనాల్లో వరి గడ్డి తెచ్చి చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో అధిక ధర వెచ్చించి పశుగ్రాసాన్ని రైతులు కొనుగోలు చేస్తున్నారు. నాలుగు నెలలు కిందట వరి గడ్డి రూ.90 నుంచి రూ.110 ధర పలకడం గగనంగా ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.210కి చేరడం గమనార్హం.
రాయితీపై జొన్న, మొక్కజొన్న విత్తనాలు..
-డాక్టర్ ఆసిఫ్, ఏడీ, బంగారుపాళ్యం
పశుగ్రాసం సమస్య అధిగమించేందుకు రెండు టన్నుల జొన్నలు, మొక్కజొన్నల విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపాం. విత్తనాలు జిల్లాకు సరఫరా అయిన వెంటనే రాయితీపై రైతులకు అందజేస్తాం.
రాయితీ దాణా ఇవ్వడం లేదు..
-గురుస్వామి, పాడిరైతు, తుంబపాళ్యం
పాడిరైతుల అభ్యున్నతికి గత ప్రభుత్వ హయాంలో రాయితీపై పశువుల దాణా పంపిణీ చేసేవారు. పశుపోషణ శిబిరాల ద్వారా ఉచితంగా గ్రాసం పంపిణీ చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాడిరైతుల సమస్యలు పట్టించు కోవడం లేదు. రోజుకు రూ.210 వెచ్చింది కొనుగోలు చేస్తున్నా గడ్డి చాలడం లేదు. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు. జిల్లాలోని వేలాది మందిది. పాడిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
[ 28-04-2024]
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
[ 28-04-2024]
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు
[ 28-04-2024]
తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!