జగన్ ‘లూటీ’ ఛార్జి
పుత్తూరు నుంచి బెంగళూరుకు గతంలో ఎక్స్ప్రెస్ సర్వీసులో రూ.230 ఛార్జీ వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.300 తీసుకుంటున్నారు. ఒకేసారి రూ.70 పెంచారు. అదే అల్ట్రా డీలక్స్కు గతంలో రూ.330.. ఇప్పుడు రూ.450కు చేరింది.
వైకాపా పాలనలో ఆర్టీసీ బాదుడు
ఎడాపెడా పెంచి.. పేదల నడ్డి విరిచి
ఇదీ జిల్లాలో దుస్థితి
పుత్తూరు నుంచి బెంగళూరుకు గతంలో ఎక్స్ప్రెస్ సర్వీసులో రూ.230 ఛార్జీ వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.300 తీసుకుంటున్నారు. ఒకేసారి రూ.70 పెంచారు. అదే అల్ట్రా డీలక్స్కు గతంలో రూ.330.. ఇప్పుడు రూ.450కు చేరింది. ఒకేసారి రూ.120 భారం పేద, మధ్య తరగతి ప్రజలపై పడింది. బస్సులైనా సామర్థ్యంతో ఉన్నాయా అంటే గమ్యస్థానం ఎప్పుడు చేరుకుంటామో తెలియని దుస్థితి.
చిత్తూరు నుంచి తిరుపతికి గతంలో ఛార్జీ రూ.70 ఉండగా ప్రస్తుతం రూ.110 వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ఏ బస్సు ఏ మార్గంలో వెళ్తుందో తెలియని స్థితి. ఒక బస్సు కపిలతీర్థం, అలిపిరి, రుయా, బాలాజీ కాలనీ, చంద్రగిరి మీదుగా వెళ్తే మరొకటి కపిలతీర్థం, బాలాజీ కాలనీ, మహిళా యూనివర్సిటీ మీదుగా వెళ్తుంది. కొన్ని సర్వీసులు మార్కెట్యార్డు మీదుగా బైపాస్లో వెళ్తుంటాయి. దీంతో ప్రయాణికుల తిప్పలు చెప్పనలవికావు.
పలమనేరు-మదనపల్లెకు గతంలో రూ.55 ఛార్జీ. ప్రస్తుతం రూ.70. పలమనేరు నుంచి కుప్పానికి గతంలో రూ.55 ఉండగా ప్రస్తుతం రూ.90.
పుత్తూరు, న్యూస్టుడే: రాష్ట్రంలో ఏ రంగంలో తీసుకున్నా బాదుడే బాదుడు.. అని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సీఎం జగన్.. ఎన్నికల సందర్భంగా ప్రతి బహిరంగ సమావేశంలో ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చారు. ఒకే సారి దూరాన్ని బట్టి రూ.5 నుంచి రూ.120 పెంచేశారు. వచ్చే ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేశారా అంటే అదీ లేదు. డొక్కు బస్సులే దిక్కు. జిల్లాలో 467 ఆర్టీసీ సర్వీసులున్నాయి. అందులో 20 శాతం బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిన సందర్భాలు ఉన్నాయి. జిల్లాలోని ఆరు డిపోల పరిధిలోని 467 సర్వీసులను తిప్పుతున్నారు. నిత్యం లక్షల మందిని తీసుకెళ్తున్న ఆర్టీసీ సర్వీసుల సామర్థ్యం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. పలమనేరు ఆర్టీసీ డిపోలో 69 సర్వీసులు కుప్పం, తిరుపతి, తిరుమల, మదనపల్లె, తదితర మార్గాల్లో నడుస్తున్నాయి. ఏ సర్వీసు ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన చెందే పరిస్థితి. కుప్పం డిపో పరిధిలోని పలు బస్సులు ఆగిపోయిన సందర్భాలున్నాయి. పుత్తూరు-చిత్తూరు మార్గంలో ఇదే పరిస్థితి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు. కొత్త బస్సుల కొనుగోలు మరిచి.. ఉన్న వాటికే మరమ్మతులు చేసి తిప్పుతున్నారు.
పలమనేరు-కుప్పం మార్గంలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు
20 శాతం బస్సులు కండిషన్ లేనివే..
వివిధ మార్గాల్లో 20శాతం సర్వీసులు కండిషన్ లేనివే నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఇంజిన్లు మరమ్మతులు చేసి వాటినే తిప్పుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే బస్సులయితే మరీ అధ్వానంగా ఉన్నాయి.
భారం మోపారు..
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీలు ఒకే సారి భారీగా పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడింది. గతంలో పళ్లిపట్టు నుంచి కర్ణాటకలోని హొస్కోటకు రూ.200 వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.250 వసూలు చేస్తున్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణ ఖర్చులు పెంచి నడ్డి విరిచారు.
కేశవులు, కేబీఆర్పురం, పుత్తూరు మండలం
ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమన్నారు
తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోమని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచారు. ఆయన బటన్ నొక్కి నగదు బదిలీ చేస్తున్నట్లు గొప్పలు చెబుతున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్న విషయం ప్రజలు గమనించాలి.
బాలిరెడ్డి, పుత్తూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
[ 21-05-2024]
వైకాపాకు అంటకాగిన పోలీసు ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి వరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే డీఐజీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి అధికారులపై వేటు వేసింది. ఇలా ఓ వైపు ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తున్నా.. జిల్లాలోని పలుచోట్ల క్షేత్ర స్థాయిలో మార్పు కనిపించడం లేదు. -
అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట
[ 21-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ శాతమూ బాగా పెరిగింది. -
వైకాపాకుకొమ్ము కాశారు..!
[ 21-05-2024]
పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. -
అధికారం అండ.. గ్రా‘నైట్’ దందా
[ 21-05-2024]
రాజకీయంగా పలుకుబడి.. అధికారం అండ ఉంటే చాలు.. ఎంతటి అక్రమాన్ని అయినా.. సక్రమమేనని ప్రజలను నమ్మించవచ్చన్న అక్రమార్కులు గ్రానైట్ దందాను దర్జాగా సాగిస్తున్నారు. -
ఇసుక అక్రమాలు ఆపమంతే!
[ 21-05-2024]
ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితంగా ఉన్న సంస్థలు ఇసుకను యథేచ్ఛగా బొక్కేశాయి. -
గంగమ్మ చెంతనేతల వేషాలు ముగిసినట్లేనా?
[ 21-05-2024]
తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
విలీన పాపం.. విద్యార్థులకు శాపం
[ 21-05-2024]
పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు. -
‘అధికార’ ఒప్పందం.. అడ్డగోలు నియామకం
[ 21-05-2024]
రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. -
జననీ.. పావనీ.. పాహిమాం
[ 21-05-2024]
జగజ్జననీ.. లోకనాయకి.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతర వేడుకలకు చిత్తూరు నగరం సర్వసన్నద్ధమైంది. -
వైభవంగా అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం
[ 21-05-2024]
కుప్పం గ్రామదేవత శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో భాగంగా సోమవారం రాత్రి శ్రీప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తుంటే ఏం చేస్తున్నారు?
[ 21-05-2024]
మండల పరిధి ఓ.జి.కుప్పం వద్ద కుశస్థలి నదిలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా హెచ్చరిక బోర్డులు పెట్టాలని, దండోరా వేయించాలని జేసీ పి.శ్రీనివాసులు ఆదేశించారు. -
చక్కెర, గోధుమపిండి అరకొరగా..
[ 21-05-2024]
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇంటి వద్దకే బియ్యం పంపిణీ ఆర్భాటాలే తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులున్నాయి. -
తల తీసేస్తా..!
[ 21-05-2024]
శ్రీకాళహస్తీశ్వరాలయంలో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డును తల తీసేస్తానంటూ ఒప్పంద ఉద్యోగి బెదిరించడం చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇద్దరు నడిరోడ్డుపై ప్రాణాలు కోల్పోతే.. 15 గంటల్లో బెయిలా..?
-
బోర్గ్ డ్రింకింగ్.. అమెరికా యువతను మత్తెక్కిస్తున్న కొత్త ట్రెండ్!
-
రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్
-
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు
-
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
-
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?