తెదేపా నేతపై దాడి
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు
గాయపడ్డ సుబ్బరాజు
కల్లూరు, న్యూస్టుడే: పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు. ఈ మేరకు తెదేపా నాయకుడు సుబ్బరాజు కల్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో పేర్కొన్న మేరకు... శుక్రవారం సాయంత్రం బి.వడ్డపల్లి గ్రామ సమీపంలోని మైదానంలో కొందరు పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు. అక్కడకు చేరుకున్న వైకాపాకు చెందిన రెడ్డప్ప, వెంకటరమణ ఇరువురు వాలీబాల్ నెట్ తమ పార్టీ వాళ్లు ఇచ్చిందని గొడవకు దిగారు. తాము వాలీబాల్ పోటీల్లో గెలిచి నెట్ తెచ్చుకొన్నామని పిల్లలు వారించారు. దీంతో మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో, ఇక్కడ తెదేపా వారు వాలీబాల్ ఆడకూడదని రెడ్డప్ప, వెంకటరమణ ఇరువురు వాదించారు. అక్కడే కూర్చుని ఉన్న తన తలపై రాయితో దాడి చేసి తీవ్రంగా గాయ పరచినట్లు తెదేపా నాయకుడు సుబ్బరాజు ఫిర్యాదులో వివరించారు.
ప్యాసింజర్ ఆటోను ఢీకొన్న కారు
8 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
పుంగనూరు గ్రామీణ, న్యూస్టుడే: ఆటోను వెనుక నుంచి కారు ఢీ కొనడంతో 8 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని జిల్లా సరిహద్దులో శుక్రవారం సాయంత్రం జరిగింది. పుంగనూరు మండలం సింగిరిగుంట గ్రామానికి చెందిన 14 మంది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామంలోని రైతు కుమార్కు చెందిన టమాటా చెట్లకు పుర్ర కట్టేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కారు అతి వేగంగా వచ్చి వెనుక నుంచి రెండు సార్లు ఢీ కొంది. దీంతో ఆటో రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మునెమ్మ (65)కు తలకు బలమైన గాయమైంది. సుజాత (45)కు తీవ్ర గాయాలవడంతో మదనపల్లెకు తరలించారు. పుట్టమ్మ (45), గాయత్రి (32), పెద్దరెడ్డిమ్మ (46), వైశాలి (18), నాగవేణి (22), జ్యోతి (34), పద్మావతి (45), పార్వతమ్మ (60)కు ఎముకలు, నడుము, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఎంపీపీ భాస్కర్రెడ్డి, సర్పంచి ఆంజప్ప పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రామకుప్పం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. మండలంలోని మిట్టపల్లికి చెందిన సోమశేఖర్ ఈనెల 14న తన తండ్రిని వి.కోటలో విడిచిపెట్టి స్వగ్రామానికి వస్తుండగా కెంపసముద్రం సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి కుప్పం ఆస్పత్రికి తరలించారు. సోమశేఖర్ చికిత్స తీసుకుంటూ శుక్రవారం మృతి చెందాడు. సోమశేఖర్ భార్య హాజీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సాగుదారు.. జగన్ హక్కుదారు
[ 02-05-2024]
జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. -
పప్పన్నం లేనట్లే..
[ 02-05-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప. -
పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
[ 02-05-2024]
-
పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
[ 02-05-2024]
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. -
ఎ‘వరి’కి చెప్పుకోవాలో
[ 02-05-2024]
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నాయి జగన్...
[ 02-05-2024]
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. -
కర్రలు, రాళ్లతో వెంటాడి..
[ 02-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. -
మేనిఫెస్టోలో భాజపా చిత్రాలేవి: మంత్రి పెద్దిరెడ్డి
[ 02-05-2024]
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
[ 02-05-2024]
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. -
వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!
[ 02-05-2024]
ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు -
పోలీసులకు ఒక్కరోజే..!
[ 02-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మొదటి రోజు విలపింఛెన్దారులు
[ 02-05-2024]
ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, -
హామీల వలలో మున్సి‘పల్టీలు’
[ 02-05-2024]
ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM