వరదొచ్చింది.. ఊడ్చేసింది
గోదావరి ఉగ్రరూపం రైతులను నిలువునా ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పీకల్లోతు కష్టనష్టాల్లోకి నెట్టేసింది. జులై రెండోవారం నుంచి నెలాఖరువరకు కురిసిన వర్షాలకు తోడు.. ఎగువనుంచి పోటెత్తిన వరద 20 రోజులపాటు కాలు కదలనీయలేదు. తాజాగా ఎగువన వర్షాలతో మరోమారు అదే స్థాయిలో
ముమ్మిడివరం: గేదెల్లంకలో తోటల్లోకి మళ్లీ చేరిన వరద
ఈనాడు-అమలాపురం, న్యూస్టుడే-ముమ్మిడివరం: గోదావరి ఉగ్రరూపం రైతులను నిలువునా ముంచేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పీకల్లోతు కష్టనష్టాల్లోకి నెట్టేసింది. జులై రెండోవారం నుంచి నెలాఖరువరకు కురిసిన వర్షాలకు తోడు.. ఎగువనుంచి పోటెత్తిన వరద 20 రోజులపాటు కాలు కదలనీయలేదు. తాజాగా ఎగువన వర్షాలతో మరోమారు అదే స్థాయిలో గోదావరి విరుచుకుపడుతోంది. గత నెల వరదల ప్రభావం డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 18, తూర్పుగోదావరి జిల్లాలో 13 మండలాలపై చూపింది. పొరుగున ఉన్న అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఏడేసి మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలో మూడు, కాకినాడలో ఒక మండలంపైనా కనిపించింది. మొత్తంగా 467 గ్రామాల్లోని 3.66 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. 6జిల్లాల్లో 389 గ్రామాలు ముంపునకు గురైతే.. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 205 గ్రామాలు నీట మునిగాయి. ఏలూరు జిల్లాలో 76, కోనసీమ జిల్లాలో 53, పశ్చిమగోదావరిలో 33, తూర్పుగోదావరిలో 22 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏడుగురు మృత్యువాత పడ్డారు. 3,467 హెక్టార్లలో వ్యవసాయ, 8,614 హెక్టార్లలో ఉద్యాన పంటలు మునిగాయి. గత నెలలో భద్రాచలం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీల వద్ద మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేస్తే.. తాజాగా మూడు రోజులుగా వరదలతో రెండో ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఖరీఫ్ సాగుకు ఆదిలోనే వరదలు విఘాతం కలిగిస్తే.. చేతికందిన ఉద్యాన పంటలు వేల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయాయి. వరద తగ్గాక మళ్లీ నారు వేసేందుకు కొందరు సమాయత్తమైతే, ఆ పొలాలు మళ్లీ మునిగాయి. దీంతో సీజన్పై ఆశలు వదులుకున్నారు. కోనసీమ పరిధిలోనే 213.82 హెక్టార్లలో వరి నారుమళ్లు, 6,402 హెక్టార్లలో ఉద్యాన పంటలు.. తూర్పుగోదావరిలో 1,145 హెక్టార్లలో వరి నారుమళ్లు, 1,951 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. కడియం నర్సరీ, పూల తోటలూ ధ్వంసమయ్యాయి. పశ్చిమగోదావరిలో 242 హెక్టార్లలో వరి, 247 హెక్టార్లలో ఉద్యాన పంటలు, అల్లూరి జిల్లాలో 1,502 హెక్టార్లలో వ్యవసాయ పంటలు మునిగాయి. ప్రత్యేక బృందాలతో పంట నష్టం అంచనాలు కొలిక్కివస్తున్న తరుణంలో మరోమారు వరద పోటెత్తింది. 2 నెలలుగా వ్యవసాయ, ఉపాధి పనులకు దూరమైన బాధితులు పంటలపైనా ఆశలు వదులుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే రూ.2వేల సాయం ఎటూ చాలని పరిస్థితి నెలకొంది. ్ర సాగుదారుల్లో 90శాతం కౌలు రైతులే కావడంతో వరుస విపత్తులతో కుంగిపోతున్నారు. అరటి, మిర్చి పంటలకు ఎకరాకు రూ.50 వేలకుపైనే నష్టపోతే, కూరగాయల పంటలకు ఎకరాకు రూ.30-40 వేలు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరాకు రూ.20-25వేల చొప్పున కౌలు చెల్లించే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఏటా రెండు, మూడు విపత్తులను ఎదుర్కొంటూ పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో చాలామంది సాగుకు దూరమవుతున్నారు. పొలాల్లో ఇసుక మేటలూ ఇబ్బందిగా మారాయి.
పనుల్లేక యాతన
జులై వరదలతో మూడు వారాలు అవస్థలు పడ్డాం. వరద ముంచెత్తడంతో ఆర్థికంగా దెబ్బతిన్నాం. పనుల్లేక ఇంటిల్లిపాదీ సతమతమవుతున్నాం. వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటే మళ్లీ వచ్చేస్తోంది. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మాలాంటోళ్లు ఈ పరిస్థితుల్లో ఎలా బతికేది..? పరిహారంగా ఇచ్చిన రూ.2 వేలు ఇల్లు బాగుచేసుకోవడానికి కూడా చాలలేదు.
-కొమ్ముల ఏసు, పెదపట్నంలంక, మామిడికుదురు
పంటలన్నీ కుళ్లిపోయాయి..
ఊహించని విధంగా ఈ ఏడాది జులైలోనే వరదలొచ్చాయి. ఎకరన్నరలో వంగ, బెండ, మిరప వేశా. అన్నీ వరదకు తుడిచిపెట్టుకుపోయాయి. 15రోజులపాటు పంటలు ముంపులోనే ఉండడంతో కుళ్లాయి. రూ.లక్ష వరకు పెట్టుబడి నష్టపోయా. వరద తగ్గిందనుకుంటే మళ్లీ పొలాల్లోకి చేరింది. మరో నెల వరకు కొత్త పంటలేసే అవకాశం లేదు.
- పట్టాభిరామప్రసాద్, లంక ఆఫ్ ఠాణేలంక, ముమ్మిడివరం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM