Andhra News: మేనకోడలితో రెండో పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశాడు..
మేనకోడలితో రెండోపెళ్లికి ఆమె తండ్రి నిరాకరించాడని, అతణ్ని చంపి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గతనెల 27న గోపాలపురం మండలంలోని భీమోలు రోడ్డులోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరిగింది. అప్పట్లో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారించారు.
వివరాలు వెల్లడిస్తున్న క్రైమ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు
గోపాలపురం, న్యూస్టుడే: మేనకోడలితో రెండోపెళ్లికి ఆమె తండ్రి నిరాకరించాడని, అతణ్ని చంపి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన గతనెల 27న గోపాలపురం మండలంలోని భీమోలు రోడ్డులోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరిగింది. అప్పట్లో గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారించారు. సీసీ కెమెరాల ద్వారా విచారించి హంతకులను పట్టుకున్నారు. దేవరపల్లి సర్కిల్ కార్యాలయం వద్ద క్రైమ్ అడిషనల్ ఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత నెల 27న పోలవరం కుడి కాలువ గట్టుపై గుర్తు పట్టడానికి వీలులేని విధంగా మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. భీమోలు రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం బుసురాజుపల్లికి చెందిన ఆదిమూలం ఏసుపాదాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తించి విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి.
పెళ్లికి నిరాకరించాడనే..
ఏసుపాదానికి గతంలో పెళ్లి కాగా, భార్య గొడవపడి పాపతో పాటు పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడులోని తన అక్క కూతురిని రెండోపెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వివాహం చేయమని బావను కోరగా అతడు నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. అతణ్ని హత్య చేసేందుకు బుట్టాయగూడేనికి చెందిన దార రామచంద్రరావు, బేతాళ శేఖర్, కొల్లి పవన్కల్యాణ్తో కలిసి రూ.రెండు లక్షలు సుపారీ కుదుర్చుకున్నాడు. వాళ్ల పథకంలో భాగంగా బావ రాజును గతనెల 27న ఇంటికి పిలిచి అందరూ కలిసి మద్యం తాగారు. ఇంకా తాగుదామని చెప్పి పవన్కల్యాణ్ కారులో, సమీపంలోని పోగొండ ప్రాజెక్టు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుతున్న సమయంలో వారి వెంట తెచ్చుకున్న ఇసుప రాడ్డుతో రాజు మెడ వెనుక భాగంలో కొట్టి చంపారు. సాక్ష్యాలు ఉండకూడదని మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కొయ్యలగూడెంలో పెట్రోలు బంకులో పెట్రోల్ కొని గోపాలపురం వచ్చారు. అక్కడి నుంచి సమీప కాలువ గట్టుకు తీసుకెళ్లి పెట్రోలు పోసి కాల్చేశారు. కేసు ఛేదించిన డీఎస్పీ శ్రీనాథ్, సీఐ ఎ.శ్రీనివాసరావు, ఎస్సైలు రామకృష్ణ, శ్రీహరి, రవీంధ్రబాబు, ఇతర సిబ్బందిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం