తలపడు... నిలబడు
ఆయనో గురువు.. తన స్థానాన్ని మరచి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన ఇటీవల జేఎన్టీయూకేలో జరిగింది.
న్యూస్టుడే, కాకినాడ(వెంకట్నగర్)
ఆయనో గురువు.. తన స్థానాన్ని మరచి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆగడాలు శ్రుతిమించడంతో బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటన ఇటీవల జేఎన్టీయూకేలో జరిగింది. జగ్గంపేటలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై కొంతమంది తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. ఈ తరహా వెలుగులోకి వస్తున్నవి కొన్నే.. మరుగున ఉంటున్నవి ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. విద్యాలయాలు, పని ప్రదేశాల్లో ఒక తరహా వేధింపులు ఉంటుంటే.. గృహాల్లో బంధుత్వం ముసుగులో మృగాళ్లు బాలికలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాకినాడలోని దిశ వన్స్టాప్లో నమోదైన గృహహింస, అత్యాచారం, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, కిడ్నాప్ తదితర కేసులు పరిశీలిస్తే.. అత్యధికంగా 18ఏళ్ల లోపు వయసు వారిపై ఎక్కువగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనల్లో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్న వారు అయిదు శాతానికి మించడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇవీ భయాలు...
* పేద, మధ్య తరగతి ఆడపిల్లలు ‘నిందితునికి శిక్షపడటం కన్నా పరువే ముఖ్యమని భావిస్తున్నారు.
* కుటుంబ నేపథ్యం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పెద్దల పంచాయతీలోనే న్యాయం కోరుతున్నారు.
* తమ ప్రమేయం లేని దాడిలో అవమాన భారంతో విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.
* ఎదురైన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని కుంగుబాటుకు గురవుతున్నారు.
* నమ్మి మోసపోయామని.. తల్లిదండ్రులకు తెలిస్తే వారు ఎలాంటి శిక్ష విధిస్తారోనన్న ఆందోళన, నిందితులు ప్రతీకారం తీర్చుకుంటారనే భయం నోరు మెదపకుండా చేస్తోంది.
సైబర్ వేధింపులపై సహాయానికి: 91212 11100
బయటకు రావాలి..
వేధింపులు, హింసకు గురైన 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికలతో సహా మహిళలందరికీ దిశ వన్స్టాప్ కేంద్రం రక్షణ కల్పిస్తుంది. కుటుంబం, కార్యాలయాలు, విద్యాలయాలు ఏ ప్రదేశంలోనైనా మహిళలు, బాలికలకు కావలసిన మద్దతు అందిస్తుంది. వారికి ఎదురవుతున్న సమస్యను స్త్రీ, శిశు సంక్షేమశాఖకు, పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి. బాధితులు కుంగిపోకుండా ఉండేందుకు మానసిక, సామాజికపరమైన కౌన్సెలింగ్ అవసరం.
- డీఏఎస్ శ్రావ్య, లీగల్ కౌన్సిలర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?