logo

వలకట్ల ధ్వంసం.. మత్స్యకారుల నిరసన

మండలంలోని పాశర్లపూడిబాడవ వైనతేయ నదిలో రైల్వే వంతెన పనుల కారణంగా తమ వలకట్లు ధ్వంసమయ్యాయని స్థానిక మత్స్యకారులు బుధవారం నిరసన తెలిపారు

Published : 19 Jan 2023 06:17 IST

పాశర్లపూడిబాడవలో ఆందోళన

మామిడికుదురు, న్యూస్‌టుడే: మండలంలోని పాశర్లపూడిబాడవ వైనతేయ నదిలో రైల్వే వంతెన పనుల కారణంగా తమ వలకట్లు ధ్వంసమయ్యాయని స్థానిక మత్స్యకారులు బుధవారం నిరసన తెలిపారు. పనులు జరుగుతున్న ప్రదేశం వద్దకు పడవలపై వెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు చేయడం వల్ల రూ.లక్షలు వ్యయంతో నది మధ్యలో చేపల వేట కోసం ఏర్పాటు చేసుకున్న   వలకట్లు దెబ్బతిన్నాయన్నారు. సత్వరమే వీటికి పరిహారం ఇవ్వాలంటూ డిమాండు చేశారు. న్యాయం చేయకపోతే పనులు   జరగనివ్వబోమని స్పష్టం చేశారు. స్థానిక మత్స్యకార సంఘాల నాయకులు పలువురు నిరసనలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని