logo

తెదేపా విజయోత్సవం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మూడు చోట్లా విజయం సాధించడం పట్ల కోరుకొండలో విజయోత్సవాన్ని సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించాయి.

Published : 21 Mar 2023 05:41 IST

కోరుకొండలో పార్టీ శ్రేణుల సందడి

కోరుకొండ, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా మూడు చోట్లా విజయం సాధించడం పట్ల కోరుకొండలో విజయోత్సవాన్ని సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించాయి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఆధ్వర్యంలో స్థానిక హరేరామ కల్యాణ మండపం నుంచి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం రహదారి మీదుగా బస్టాండు వరకు నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్రంలో తెదేపాకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని