గడప దాటనిధి.. గోడు తీరనిది
‘గడప గడపకు మన ప్రభుత్వం’ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇంటింటా తిరుగుతూ గుర్తించిన సమస్యలన్నీ ఎన్నికల్లోపు పరిష్కరించాలనేది లక్ష్యం.
ఈనాడు, కాకినాడ: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఇంటింటా తిరుగుతూ గుర్తించిన సమస్యలన్నీ ఎన్నికల్లోపు పరిష్కరించాలనేది లక్ష్యం. క్షేత్రంలో సమస్యలు గుర్తిస్తున్నా.. ఆశించిన రీతిలో పరిష్కారానికి చొరవ లేదు. కార్యక్రమం 10 నెలల కిందట ప్రారంభమైనా హామీల అమలులో ప్రగతి ఆశించిన తీరులో సాగక పీడిత ప్రాంత ప్రజలు పెదవి విరుస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే గడప గడపకూ వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు కొందరు నేటికీ సీరియస్గా తీసుకోకపోవడం ఓ సమస్య అయితే.. గుర్తించిన సమస్యలకూ నిధుల లేమి, సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారడం మరో సమస్యగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో తామేం చేశామో ప్రజలకు వివరించడంతోపాటు.. ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కారం చూపడంలోనూ వెనుకబాటు దర్శనమిస్తోంది.
సమస్యల మోత...
పింఛన్లు రావడంలేదని కొందరు.. ఇళ్లు మంజూరు కాలేదని ఇంకొందరు.. ప్రభుత్వ పథకాలు అందడంలేదని.. అర్హత ఉన్నా ఏ సాయమూ అందలేదని మరికొందరు.. అడపాదడపా గళం విప్పుతున్నారు. రోడ్లు బాగాలేవు.. కాలువలు అధ్వానం.. వర్షం పడితే ముంపు.. తాగునీటి సమస్య వేధిస్తోంది.. ఇలా గడప గడపలో ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకుల ఎదుట ప్రజలు సమస్యలను ఏకరవు పెడుతున్నారు. అన్నీ పరిష్కరిస్తామని చెబుతున్నా.. ఇన్నాళ్లూ పట్టించుకోలేదు ఇంకేం పట్టించుకుంటారని అసహనంతో కొందరు నిలదీస్తున్నారు. ఇంకొందరు నాయకుల మాటలను నమ్మి పనుల పూర్తిని ఆశిస్తున్నారు.
బిల్లులు రావని సంశయం
కడియం: రాజమహేంద్రవరం గ్రామీణంలో ఏడు గ్రామాల్లో రూ.1.04 కోట్లతో 15 పనులు చేయాలని నిర్ణయిస్తే.. అయిదు పనులు పూర్తయ్యాయి. వీటిలో నాలుగు పనులకు రూ.80 లక్షలు చెల్లించారు. కడియం మండలంలో ఎనిమిది పనులకు గుత్తేదారులు ముందుకు రాలేదు. పనులు చేశాక బిల్లులు మంజూరుపై అనుమానాలే ఈ పరిస్థితికి కారణం. దీంతో రూ.1.05 కోట్లతో చేపట్టాల్సిన ఈ 24 పనుల పూర్తిపై సందిగ్ధం నెలకొంది. దీంతో దిగువ శ్రేణి నాయకులు పనుల పూర్తికి ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
వివిధ దశల్లో 145 పనులు
కొవ్వూరు: మద్దూరులో రహదారి నిర్మాణం
కొవ్వూరు పట్టణం: నియోజకవర్గంలో రూ.42.5 లక్షల విలువైన 16 పనులే పూర్తయ్యాయి. 145 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. చేసిన పనులకు రూ.25 లక్షలు బిల్లులు రావాలి. పనుల వివరాలు సీఎఫ్ఎంఎస్లో పెట్టినా ఎదురుచూపులే. చాగల్లు మండలంలో 16 పనులు చివరి దశలో ఉన్నా నిధులపై సందిగ్ధం నెలకొంది. తాళ్లపూడిలోనూ నిధుల లేమి ఇబ్బందిగా మారింది.
అడుగడుగునా ఆపసోపాలు..
నిర్దేశిత పనులకు గుత్తేదారులు ఆసక్తిచూపట్లేదు. దీంతో ఎక్కువ శాతం అధికార పక్ష నాయకుల అనుచరులే భుజాన వేసుకోవాల్సి వస్తోంది. చేసిన పనులకు బిల్లులు రాక.. కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పనులు సాగడం లేదు. బిల్లులు రాలేదన్న వాదన బాహాటంగా వినిపించలేక నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.
రూ.1.54 కోట్లు ఇవ్వాలండి
బిక్కవోలు: తొస్సిపూడి రోడ్డు
బిక్కవోలు: అనపర్తి మండలంలో 29 పనులు మంజూరైతే 14 పనులు పూర్తిచేశారు. బిక్కవోలుకు 22 పనులు మంజూరైతే 11, పెదపూడిలో 37 పనులకు 10, రంగంపేట మండలంలో 33 పనులకు 16 పనులు మాత్రమే పూర్తయ్యాయి. నియోజకవర్గంలో పూర్తయిన 51 పనులకు రూ.1.54 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరడంతో అన్ని పనులు ప్రారంభించినట్లు చూపించినా.. క్షేత్రస్థాయి ప్రగతి మాత్రం భిన్నంగా ఉంది.
12 మాత్రమే పూర్తి..
నిడదవోలు: నియోజకవర్గంలో 12 పనులు పూర్తయితే.. ఆరు పనులు వివిధ దశల్లో ఉంటే.. 26 పనులు మొదలు కాలేదు. బిల్లుల బకాయి సుమారు రూ.80 లక్షలు ఉంది.
సాంకేతిక ఆటంకమనీ...
గోపాలపురం ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డు
గోపాలపురం: నియోజకవర్గంలో ఇప్పటికి 25 పనులే పూర్తవగా 331 పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. తొమ్మిది పనులు మొదలవలేదు. నల్లజర్ల మండలంలో 112 పనులకు 19 పూర్తిచేశారు. ఇక్కడ రూ.62 లక్షలకు రూ.24 లక్షలే విడుదలయ్యాయి. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ఆరు పనులైనా బిల్లులు కాలేదు. సీఎఫ్ఎంఎస్లో అడ్డంకులు కారణంగా చెబుతున్నారు.
నిధుల లేమితో ఇబ్బంది
రాజానగరం: నియోజకవర్గంలో 60 శాతం పనులు చేసినా.. రూ.95 లక్షల బిల్లులు బకాయిలు ఉన్నాయి. పనుల నెమ్మదికి ఇదే కారణం. పంచాయతీలు చేయాల్సిన పనులు కూడా గడప గడపకులో నమోదు చేసినట్లు తెలుస్తోంది. పనులు ప్రారంభించినా పూర్తికాకపోవడం.. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం సమస్యగా మారింది.
అయిదు పనులే కొలిక్కి..
టి.నగర్: నగరంలో అయిదు పనులు మాత్రమే పూర్తయ్యాయి. రూ.4.50 కోట్లతో 28 పనులు ప్రగతి దశలో ఉన్నాయి. ఇంకా 38 పనులు ప్రారంభించాల్సి ఉంది. టెండరు దశలో ఏడు పనులు ఉన్నాయి. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించలేదు. తాజాగా గడప గడపకు పనులకు రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పట్టాలెక్కించాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్య ‘నిషా’దం.. బతుకుల్లో ‘విషాదం’
[ 09-05-2024]
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి. -
నాయకా.. ఇంకెన్నాళ్లు ముంచుతారు?
[ 09-05-2024]
చారిత్రక నగరంలో వర్షం పడిందంటే జనజీవనం స్తంభిస్తోంది. 44.5 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న నగరం చుట్టుపక్కల ముంపు సమస్య వేధిస్తోంది. అభివృద్ధి చేయని కాలువ వ్యవస్థ అయిదేళ్లలో ముగ్గురిని మింగేసింది. -
మాట తప్పావ్.. మడం తిప్పావ్..
[ 09-05-2024]
వైకాపా పాలనలో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు. -
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
[ 09-05-2024]
ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం(ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. -
ఓట్ల కోసం నోట్ల వల
[ 09-05-2024]
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు. -
పండుటాకులకు తప్పని పింఛను ప్రయాస
[ 09-05-2024]
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధ్దులు అవస్థలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సైతం సొమ్ము కోసం దూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న కూటమి నేతలు
[ 09-05-2024]
సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపులో బుధవారం సాయంత్రం తెదేపా, జనసేన, భాజపా నేతలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లోడింగ్తో ఉన్న లారీలను నిలిపివేశారు. -
కళ్లముందున్నా.. కోడ్ ఉల్లంఘన కనరు..!
[ 09-05-2024]
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నా ఇప్పటికీ కోడ్ ఉల్లంఘనలపై అధికారులు దృష్టిసారించడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శం. కోడ్ పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. -
తెదేపా తెచ్చిపెడితే.. వైకాపా వదిలేసింది
[ 09-05-2024]
నియోజకవర్గకేంద్రమైన పి.గన్నవరం అంబేడ్కర్ కాలనీలో తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన సామాజిక నైపుణ్య శిక్షణ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. -
వైకాపా, కూటమి శ్రేణుల ప్రచారంలో ఉద్రిక్తత
[ 09-05-2024]
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.. -
‘గాజువాకలో జరిగిన తప్పు.. పిఠాపురంలో జరగకూడదు’
[ 09-05-2024]
‘‘గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్కల్యాణ్ను గెలిపించుకోకుండా తప్పు చేశాం.. పిఠాపురంలో మళ్లీ ఆ తప్పు జరగకూడదు’’ అని విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, గాజువాక ప్రజలు నినదించారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్