శిక్షణ ముగిసే నాటికి ఆట ఆరంభం
జిల్లావ్యాప్తంగా 49 శిబిరాలు... ఒక్కోదానికి 80 మంది బాలబాలికల ఎంపిక... నెలరోజుల పాటు వీరికి శిక్షణ... క్రీడా పరికరాలు, శిక్షకుల ఫీజు నిమిత్తం శిబిరానికి రూ.7 వేలు మంజూరు... ఇదీ శాప్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ ప్రణాళిక.
వేసవి శిబిరాలకు 30 రోజులకు పరికరాలు!
న్యూస్టుడే, శ్యామలాసెంటర్ (రాజమహేంద్రవరం)
ఎస్కేవీటీలో ఫుట్బాల్ శిబిరంలో క్రీడాకారులు
జిల్లావ్యాప్తంగా 49 శిబిరాలు... ఒక్కోదానికి 80 మంది బాలబాలికల ఎంపిక... నెలరోజుల పాటు వీరికి శిక్షణ... క్రీడా పరికరాలు, శిక్షకుల ఫీజు నిమిత్తం శిబిరానికి రూ.7 వేలు మంజూరు... ఇదీ శాప్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ ప్రణాళిక. మే 1న శిక్షణ ప్రారంభమయ్యే నాటికి శిక్షణ పరికరాలు అందాల్సి ఉంది. మహా అయితే వారం, పది రోజులు ఆలస్యమవ్వాలి. జిల్లాలో మాత్రం రెండు రోజుల్లో శిక్షణ ముగుస్తుందనగా హడావుడిగా పరికరాలు అందించారు. పరికరాలు అందక కొన్నిచోట్ల శిబిరాల నిర్వహణే ఆగిపోగా.. మరికొన్నిచోట్ల తూతూమంత్రంగా సాగాయి.
ఏటా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మండలి నిర్వహిస్తుంటుంది. రాజమహేంద్రవరంలో సుమారు 14 శిబిరాలు... అనపర్తి, కొవ్వూరు, ద్వారపూడి, రాజానగరం, కడియం తదితర ప్రాంతాలతో కలిపితే మొత్తం 49 వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు. శిబిరాలు రెండు రోజుల్లో ముగుస్తున్నాయనే సమయంలో హడావుడికి కొందరికి క్రీడా సామగ్రి అందించారు. దీంతో శిబిరాలను కొంతమంది ఆరంభ శూరత్వంగా ప్రారంభించి వదిలేయగా, మరికొన్ని చోట్ల పట్టుమని పదిమంది కూడా లేకుండా తూతూ మంత్రంగా కొనసాగించారు. ఇంకొన్ని శిబిరాలను పాత సామగ్రితో కొనసాగించారు. మరికొంతమంది శిబిర నిర్వాహకులు తమ సొంత నగదుతో ముందుగా అవసరమైన క్రీడా పరికరాలు కొనుగోలు చేసి నిర్వహించారు.
ఏటా నిర్వహించేదే అయినా ఎందుకీ నిర్లక్ష్యం
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలనేవి ఏటా ప్రభుత్వం నిర్వహిస్తుంది. గతేడాది కూడా ఇలాగే శిబిరం పూర్తయ్యేనాటికి పరికరాలు ఇచ్చారని ఓ శిబిరం నిర్వాహకుడు తెలిపారు. ఏటా నిర్వహించే శిబిరాల విషయంలో ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. సుమారు మూడున్నర లక్షల రూపాయల క్రీడా సామగ్రి కొనుగోలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నిస్తున్నారు. పరికరాల కొనుగోలుకు ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు దుకాణాలుండగా ఇతర రాష్ట్రాల నుంచి రప్పించటంలో ఆంతర్యం ఏమిటని క్రీడా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఏటా మేలో నిర్వహించే శిక్షణకు రెండు నెలల ముందుగానే నిర్వాహకులతో సమావేశమై ఎటువంటి సామగ్రి కావాలో తెలుసుకుని ప్రారంభం నాటికి ఇస్తే క్రీడాకారులతో శిబిరాలు కళకళలాడుతుంటాయని పలువురు అంటున్నారు.
సామగ్రి లభ్యంకాకే ఆలస్యం
కొన్ని రకాల క్రీడా సామగ్రి లభ్యం కాకపోవటం వల్ల కొనుగోలు ఆలస్యమైంది. శిబిర నిర్వాహకులు వారికి కావాల్సిన సామగ్రి ప్రతిపాదనలు అందజేయటంలోనూ కొంత ఆలస్యమైంది.
డి.శేషగిరి, జిల్లా ముఖ్య క్రీడాశిక్షకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!