కలెక్టర్ చెప్పినా ఖాతరు లేదు!
రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం..
ఇదీ జలవనరులశాఖ అధికారుల తీరు
సాగునీరు అందక అన్నదాత ఆవేదన
గ్రాంటులో బీటలు తీసిన పొలాలను చూపుతున్న కౌలురైతులు
న్యూస్టుడే, తాళ్లరేవు: రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలవనరుల శాఖ అధికారుల తీరుపై కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు, చినతిప్ప ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రాంటు పరిధిలోని రాజుల బోది, పెదమడి, 7, 8 తూముల సమీపంలోని 200 ఎకరాలకు చుక్కనీరు అందక వరి పొలాలు బీటలు తీశాయి. ఎకరానికి రూ.30 నుంచి 40 వేలు వరకు పెట్టుబడి పెట్టామని.. పొట్ట, ఈనిక దశలో ఉన్న చేలకు నీరందక చీడ, పీడలతో దెబ్బతింటున్నాయన్నారు. ఏటా సాగునీటి ఇబ్బందులతో పంట దిగుబడి తగ్గి నష్టపోతున్నామన్నారు. ప్రస్తుతానికి తాళ్లరేవు మండలం పత్తిగొంది నుంచి గ్రాంటు వరకు ప్రధాన పంట కాలువలో చుక్కనీరు లేదు. సమస్యను అధిగమించే పరిస్థితి కానరాకపోవడంతో రైతులంతా మంగళవారం కాకినాడ వెళ్లి జిల్లా కలెక్టర్ కృతికాశుక్లాకు వినవించుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గ్రాంటులోని వరి పొలాలకు నీరు చేరుతుందని జలవనరుల శాఖ ఎస్ఈ, ఈఈ వారికి హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల కోసం రైతులు ఎదురు చూసి నిరాశ చెందారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఒఎన్జీసీ పైపులైన్ పంట పొలాల మీదుగా వెళుతోందని.. పంట చేతికి వచ్చే వరకు ఈ పైపులైన్ ద్వారా పొలాలకు సాగునీరు అందించేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. విషయాన్ని ఈఈ వద్ద ప్రస్తావించగా.. ఇతరత్రా విధులతో ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించలేకపోయారని, గురువారం వెళ్లి పరిస్థితి సమీక్షిస్తామన్నారు.
చేను చూస్తే చావాలనిపిస్తోంది..
- గుత్తుల కృష్ణ, కౌలు రైతు
గ్రాంటు ఆయకట్టు చినతిప్ప బోదికి సాగునీరు ఇచ్చి 40 రోజులయింది. ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. బుధవారం ఉదయానికి నీరు అందిస్తామని జల వనరుల శాఖ అధికారులు చెప్పినా మధ్యాహ్నం మూడు గంటలైనా పొలాల వద్దకు ఎవరూ రాలేదు. చేను పరిస్థితి చూస్తుంటే ఏదైనా తాగి చావాలనిపిస్తోంది.
ఏటా ఇదే పరిస్థితి..
- వాసంశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు
ఏటా పంట ఆఖరి దశలో సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. పొట్ట, ఈనిక దశలో పుష్కలంగా నీరు అందక చీడ పీడల బారినపడి దిగుబడి తగ్గిపోతోంది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురవుతోంది. నష్టపోయిన ప్రతి ఎకరానికి బీమా పరిహారం అందజేస్తేనే మాకు మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్