పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
రాజమహేంద్రవరంలో 5:30 గంటలు నిలిపివేత
అసౌకర్యంపై ప్రయాణికుల ఆందోళన
స్టేషన్ మాస్టర్ కార్యాలయం వద్ద సిబ్బందిని నిలదీస్తున్న ప్రయాణికులు
రాజమహేంద్రవరం(వి.ఎల్.పురం), న్యూస్టుడే: షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమస్యను పరిష్కరిస్తామని రైలును ఏకంగా 5:30 గంటలపాటు నిలిపివేయడంతో అంతసేపు బోగీల్లో కూర్చోలేక ఇబ్బందిపడ్డారు. చివరికి ఆందోళన చేసి, రైల్వే సిబ్బందిని నిలదీస్తే తాత్కాలిక మరమ్మతులు చేసి రైలును వదిలారు. 19 బోగీ(కోచ్)లున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు షాలిమార్ నుంచి బయలుదేరి ఉదయం 7.33 గంటలకు రాజమహేంద్రవరం వచ్చింది. ఇందులో 12 ఏసీ కోచ్లే ఉన్నాయి. రైలు బయలుదేరినప్పటి నుంచే కొన్ని బోగీల్లో విద్యుత్తు సమస్య ఉత్పన్నమైందని కొందరు ప్రయాణికులు తెలిపారు. రాజమహేంద్రవరం వచ్చేసరికి బోగీల్లో విద్యుత్తు ఉపకరణాలేవీ పనిచేయకపోవడం, టాయిలెట్లలో నీరూ రాకపోవడంతో ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను అంతకుముందే పసిగట్టిన సిబ్బంది కడియం వద్ద ఓసారి రైలు ఆపి మరమ్మతులకు యత్నించారు. పరిష్కారం దొరక్కపోవడంతో రైలును అలాగే పంపి.. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్ చేరుకున్నాక నిలిపివేశారు. రైలింజిన్ వెనుకున్న జనరేటర్ పవర్ కార్లో సాంకేతిక సమస్యగా భావించి సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. గంటలు గడిచినా ఎంతకూ మరమ్మతులు పూర్తికాకపోవడంతో బోగీల్లోని ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. బోగీల్లో ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడం, చివరికి టాయిలెట్లలో నీరూ రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడ్డారు. రాజమహేంద్రవరం స్టేషన్లోనే 5:30 గంటలపాటు రైలు ఆపేయడంతో అసౌకర్యానికి గురైన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుస్తారని నిలదీశారు. చివరికి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు రైలు సికింద్రాబాద్కు బయలుదేరింది.
రైలు ఇంజిన్ వెనుక పవర్కార్లో జనరేటర్ను పరిశీలిస్తున్న సిబ్బంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు మద్దతుగా సినీహీరో కొణిదెల వరుణ్తేజ్ శనివారం పిఠాపురం నియోజవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి -
ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?
[ 27-04-2024]
మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. -
అన్నదాతకు అండగా ఉంటాం..
[ 27-04-2024]
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్కల్యాణ్ భరోసానిచ్చారు. -
అమ్మ ఒడి.. మామ నిబంధనల ముడి
[ 27-04-2024]
ఆధునిక విద్య అందించే క్రమంలో భాగంగా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న వారిలో ఎవరికైనా నగదు స్థానంలో ల్యాప్టాప్ కావాలంటే ఇష్టపూర్వక పత్రాలు ఇవ్వాలని తీసుకున్నారు. -
అధికారమే పెట్టుబడి.. వారి కన్నుపడితే దోపిడీ
[ 27-04-2024]
సమస్యలు పరిష్కరిస్తారని.. తమకు అండగా ఉంటారని ఓట్లేసి గెలిపించారు. అదే జనం పాలిట శాపమైంది. -
రాజానగరంలో ఎత్తుగడ
[ 27-04-2024]
జనసేనాని పవన్కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోనే తొలిసీటుగా ప్రకటించిన స్థానం రాజానగరం. -
89 ఆమోదం.. 44 తిరస్కరణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాఖలైన నామపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. -
ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి
[ 27-04-2024]
మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. -
అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?
[ 27-04-2024]
ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
18 ఆమోదం.. 10 తిరస్కరణ..
[ 27-04-2024]
కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాఖలైన నామినేషన్ల పరిశీలన శుక్రవారం కలెక్టరేట్లో పూర్తి చేశారు. కాకినాడ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, -
మంత్రి మెప్పు పొందాలని నాయకుల పాట్లు
[ 27-04-2024]
గ్రామీణ నియోజకవర్గంలో వైకాపా కేడర్కు చేరికల పాట్లు తప్పడం లేదు. మంత్రి వేణు మెప్పు పొందేందుకు ద్వితీయశ్రేణి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్