logo

సంక్షేమ పథకాలకు బీజం వేసిన ఘనత తెదేపాదే

పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు.

Updated : 29 Mar 2024 13:08 IST

తాళ్లపూడి: పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందని తెదేపా మండల అధ్యక్షుడు నామన పరమేశ్వరరావు తెలిపారు. తాళ్లపూడి మండంలోని పెద్దేవం, మలకపల్లి, తాడిపూడి, అన్నదేవరపేట తదితర గ్రామాల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాల్లో ఎన్నికల నిబంధనలను పాటించి పార్టీజెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ విజయం సాధిస్తుందన్నారు. తెదేపా సీనియర్ నాయకులు ఎల్లూరి బాబ్జీ, సిద్దా దుర్గారావు, రేఖపల్లి ముత్యాలరావు, బోడపాటికాశీ, తిరిగిపలి గోపి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని