మత్స్యకార కుటుంబాల కల.. మాటలతో వైకాపా వల
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులో హార్బర్.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది.
పూర్తికాని ఉప్పాడ హార్బర్ నిర్మాణం
గ్రాఫిక్స్ చూపిస్తూ అబద్ధాల ప్రచారం
న్యూస్టుడే, యు.కొత్తపల్లి
అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు.. ఇదిగో వచ్చేస్తోందంటూ మూడుసార్లు గడువులు నిర్దేశించారు.. నాలుగేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చారు.. అయిదేళ్ల పాలనా కాలం ముగిసినా నిర్మాణం 60 శాతమూ పూర్తిగాని పరిస్థితి.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారులో హార్బర్.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది. చివరకు నిర్మాణం పూర్తికాకపోయినా తగ్గేదేలె.. అంటూ డ్రోన్ విజువల్స్తో గ్రాఫిక్స్ చూపిస్తూ అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకుంటోంది.
కానుకగా ఇస్తామని కథలు చెప్పి.
పనులు ఆగిన తీరుపై సెప్టెంబరు 2023లో ‘ఈనాడు’లో ‘బిల్లు రాక..పనులు పడక’ శీర్షికన కథనం ప్రచురించడంతో పాలకులు, అధికారులు సమావేశం నిర్వహించి 2023 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తిచేసి హార్బర్ను మత్స్యకారులకు కానుకగా ఇస్తామని గొప్పలు చెప్పారు. మూడోసారి ఇచ్చిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ప్రస్తుతం సగం నిర్మాణమే పూర్తయింది. వైకాపా ప్రభుత్వ పాలనా కాలమూ ముగిసింది.
హార్బర్ నిర్మాణ ప్రాంతం
ప్రారంభించిన మూడు నెలలకే పడక
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హార్బర్ కోసం రూ.422 కోట్ల నిధులు కేటాయించామని గొప్పలు చెప్పింది.
2020 డిసెంబర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వర్చువల్ విధానంలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్భాటంగా పనులు ప్రారంభించి మూడు నెలలకే నిలిపేశారు. ఏడాది తర్వాత మరో సంస్థ నిర్మాణ పనులు పునః ప్రారంభించింది. కేవలం 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. దాదాపు 50 శాతం పూర్తి చేశారు. సుమారు రూ.200 కోట్ల వరకు నిర్మాణ సంస్థ పెట్టుబడి పెట్టి పనులు చేసింది. ఒక్క రూపాయి కూడా బిల్లు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపేసింది.
అసంపూర్తిగా భవన నిర్మాణాలు
సాగుతోందిలా..
నూతన హార్బర్ పూర్తి కాకుండానే వైకాపా ప్రభుత్వం మాత్రం పూర్తిచేసినట్లు ప్రచారం చేసుకుంటోందని వివిధ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. దీనికి కారణం బిల్లుల మంజూరులో జాప్యంగా తెలుస్తోంది. ఇదే కొనసాగితే మరో అయిదేళ్లు పోయినా హార్బర్ నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీని నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తికాలేదని.. స్థానిక పాలకులు, అధికారులు మాత్రం పలుమార్లు ఇక్కడ సమావేశాలు నిర్వహించి అదిగో.. ఇదిగో అంటూ అరచేతిలో అంతా చూపించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
[ 10-05-2024]
జగ్గంపేట తెదేపా కార్యాలయంలో నాయకులు నంది బాలకృష్ణ, గ్రామ ఉపసర్పంచ్ నంది రాజారావు ఆధ్వర్యంలో 8 మంది వాలంటీర్లు తెదేపాలో చేరారు. -
ఓటర్ స్లిప్ చూపించు.. రూ.3 వేలు తీసుకో..! జోరుగా వైకాపా నగదు పంపిణీ
[ 10-05-2024]
కొత్తపల్లి మండలంలో గత రెండు రోజులుగా నిత్యం అర్ధరాత్రి వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరుగుతోంది. వైకాపా నాయకులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటరు స్లిప్పుల ఆధారంగా ఒక్కో ఓటుకు రూ.3వేలు చొప్పున అందజేస్తున్నారు. -
ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు
[ 10-05-2024]
వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. -
అప్పుల ఆంధ్రాగా మార్చేశారు
[ 10-05-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేసిందని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
అయిదేళ్లలో రైతులను నిండా ముంచారు!
[ 10-05-2024]
ఎర్రకాలువకు వరదొస్తే నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, చాగల్లు మండలాల రైతులు వణికిపోతున్నారు. దీని ప్రవాహ సామర్థ్యం 20 వేల క్యూసెక్కులు. -
అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!
[ 10-05-2024]
హాట్ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. -
జగన్ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!
[ 10-05-2024]
‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. -
రాజీ మార్గంలో కేసులు పరిష్కరించాలి
[ 10-05-2024]
రాజీ పడదగిన అన్ని రకాల కేసులను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. -
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: రుద్రరాజు
[ 10-05-2024]
కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఆహ్లాదానికి రుసుం.. అడిగితే అభివృద్ధి జపం
[ 10-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువును రూ.13 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. లోపలకు అడుగుపెట్టి ఆస్వాదించాలంటే ఒక్కరికి తక్కువలో తక్కువ రూ.500 జేబులో ఉండాలి. -
ఓట్లకు ‘సామాజిక’ గాలం
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు మునిగితేలుతున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. -
ఈ ఇంట్లో ఓట్లు అమ్ముకోం!
[ 10-05-2024]
ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు తాయిలాల పంపిణీపై దృష్టి సారించారు. ఈ తరుణంలో స్థానిక రథం సెంటరులో 90 ఏళ్ల వృద్ధురాలు భమిడిపాటి శేషారత్నం తన ఇంటి వద్ద ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీ ఆకట్టుకుంటోంది. -
ఏ తల్లి కన్నబిడ్డో..!
[ 10-05-2024]
ఏ తల్లి కన్నదో తెలియదుకాని.. అభంశుభం తెలియని ఓ శిశువు మురుగు కాలువలో మృతదేహంగా కనిపించడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. -
అటు ఎన్నికలు.. ఇటు సెలవులు
[ 10-05-2024]
ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్ రిజర్వేషన్ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం