పాతదారికే పూత
కీలక రోడ్డుకు ఒక పొర తారుతో మరమ్మతులు
న్యూస్టుడే, సత్తెనపల్లి గ్రామీణం
గుంటూరు-హైదరాబాద్ మార్గంలో కీలకమైన రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. గుంతలు పడి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేపడతామంటే నిబంధనల ప్రకారం విస్తరణ జాప్యం కానుంది. ఈ క్రమంలో దీనికి అధికారులు పైపై పూతకు రంగం సిద్ధం చేశారు. నిత్యం వేల వాహనాలు తిరిగే పేరేచర్ల -కొండమోడు రోడ్డు పరిస్థితి.
ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన మార్గాల్లో పేరేచర్ల-కొండమోడు రహదారి ఒకటి. 49 కిలోమీటర్ల ఈ రోడ్డును రహదారులు భవనాల శాఖ నుంచి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు బదలాయించి మూడేళ్లు గడిచినా విస్తరణకు నోచుకోలేదు. ఎన్హెచ్ఏఐకు అప్పగించే ముందు ఆర్అండ్బీ శాఖ కనీస మరమ్మతులు చేయలేదు. ప్రయాణం నరకయాతనగా మారడంతో వాహన చోదకులు, ప్రయాణికుల ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు మరమ్మతులకు ఎన్హెచ్ఏఐ అధికారులు మొగ్గు చూపారు. మార్గదర్శకాల మేరకు మరమ్మతులు చేపట్టిన ఏడాది లోపు రహదారి విస్తరణకు నిధులు సమకూరవు. ఫలితంగా పేరేచర్ల-కొండమోడు నాలుగు వరుసల రహదారి ఏర్పాటులో అనిశ్చితి నెలకొంది.
గతంలో రూ.735 కోట్ల మంజూరు
గుంటూరు ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలతో పేరేచర్ల-కొండమోడు మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. నాలుగు వరుసల రోడ్డుకు గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధి సంస్థ రూ.738 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్లోని ఒక సంస్థ సర్వే నిర్వహించి డీపీఆర్ను అప్పటి ప్రభుత్వానికి అందించింది. సత్తెనపల్లి పట్టణానికి 9.58 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు, కంటెపూడి, ధూళిపాళ్ల, రాజుపాలెం వద్ద సర్వీసు రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు సదస్సులు నిర్వహించింది. 2019లో ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రద్దు చేయగా, నిధులు వెనక్కి మళ్లాయి.
టెండర్ల ప్రక్రియ పూర్తి
రహదారి విస్తరణలో నెలకొన్న జాప్యంతో పూర్తిగా ఛిద్రమైన సత్తెనపల్లి-కొండమోడు రహదారిపై గుంతలు పూడ్చి ఒక పొర తారుతో సరిపుచ్చాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా పనులకు రూ.11 కోట్లు నిధులు మంజూరు కాగా ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విషయమై ఎన్హెచ్ఏఐ ఏఈఈ ప్రకాశం ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారి విస్తరణ ప్రక్రియలో సర్వే, భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ, డీపీఆర్ తయారీ జరగాలని తెలిపారు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. సత్తెనపల్లి నుంచి రాజుపాలెం మీదుగా కొండమోడు వరకు 25 కిలోమీటర్ల రహదారికి ఒక పొర తారుతో రోడ్డు పనులు త్వరలో చేపడతామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
-
World News
Pakistan: పాక్లో తీవ్ర పేపర్ కొరత.. విద్యార్థుల పుస్తకాలు ముద్రించలేమని ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Social Look: నయన్- విఘ్నేశ్ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!