లక్ష్యం నెరవేరేనా!
ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు. చాలాచోట్ల నీటివసతి కలిగి
మూడోవంతు మందికే కౌలుకార్డులు
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, బాపట్ల
ఒకప్పుడు భూమి కలిగి ఉన్నవారిని రైతులుగా భావించేవారు. పంటరుణాలతోపాటు అనేక రకాలైన రాయితీ పథకాలు వీరికే అందించేవారు. అయితే పలు కారణాల వల్ల భూమి కలిగిన రైతులు సాగు నుంచి దూరమవుతున్నారు. చాలాచోట్ల నీటివసతి కలిగి సారవంతమైన భూములు సైతం సాగుకు నోచుకోవడం లేదు. ఈపరిస్థితి అటు పల్నాడు.... ఇటు డెల్టాలోనూ ఉంది. రెండు పంటలు పండించేచోట ఒకటి పండించి సరిపెట్టుకుంటున్నారు. అయితే గత దశాబ్దకాలం నుంచి వ్యవసాయంలోకి ప్రవేశిస్తున్న కౌలుదారుల సంఖ్య పెరుగుతుండటం కొంత సానుకూల పరిణామం. వీరి భాగస్వామ్యం దాదాపు అన్ని పంటలు పండించడంలోనూ ఉంటోంది. 2011 కౌలుకార్డుల మంజూరు తర్వాత వరుసగా కొన్ని సంస్కరణలు చేస్తూ కౌలుదారులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో కార్డులు మంజూరు మాత్రం చాలా తీసికట్టుగా ఉంటోంది. ఫలితంగా ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు.
ఈ-పంట నమోదు మొదలు పంటలబీమా, రాయితీ పథకాలు, పంటరుణాలు, రైతుభరోసా ఇలా అన్నింటిలో వారికి అవకాశాలు కల్పిస్తోంది. వాస్తవసాగులో కౌలుదారుల సంఖ్య 60శాతంపైగా ఉండగా కార్డులు పొందుతున్నవారి సంఖ్య మూడో వంతుకు మించడం లేదు. భూమి సాగుచేస్తున్న వారిని కౌలుదారులుగా గుర్తించాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఈఏడాది ఖరీఫ్ సీజన్ మొదలైన నేపథ్యంలో కౌలురైతుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా జరిగే కసరత్తులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల నుంచి కౌలు రైతుల గుర్తింపు, కార్డులు మంజూరు వంటి ప్రక్రియ మొదలైనప్పుటికీ లక్ష్యం దిశగా సాగడం లేదు.
ఆచరణ అంతంతే..
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈఏడాది 90,459 కార్డులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 33,299 కార్డులు మాత్రమే మంజూరుచేశారు. చాలాచోట్ల భూయజమానులు అంగీకరించి పత్రాలు ఇవ్వకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కౌలుదారులకు ఇవ్వడానికి యజమానులు ఇష్టపడకపోవడం, ఇప్పటికే పంటరుణాలు భూయజమానులు తీసుకుని ఉండటం వల్ల కౌలుదారులకు కార్డులు ఇవ్వడానికి వారు ఒప్పుకోవడం లేదు. కృష్ణా పశ్చిమడెల్టాలో మాత్రం కౌలుదారులు భూములు తీసుకోవడానికి ముందుకురాకుండా కార్డులు తీసుకోవడానికి అంగీకరించే రైతుల భూములు కౌలుకు తీసుకుంటామని చెబుతుండటంతో అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 11నెలల కాలవ్యవధితో పంటసాగు ధ్రువీకరణ పత్రాలు(సీసీఆర్సీ) మంజూరుచేస్తున్నా యజమానులు అంగీకరించడం లేదు. పంటరుణాలు, రైతుభరోసా, బీమా వంటివి నేరుగా కౌలుదారుల ఖాతాలకు జమచేస్తే తమకు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో పత్రాలు ఇవ్వడానికి వారు ముందుకు రావడం లేదు.
క్షేత్రస్థాయిలో అవగాహన
వ్యవసాయ, రెవెన్యూశాఖలు క్షేత్రస్థాయిలో యజమానుల్లో చైతన్యం తీసుకురావడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లక్ష్యం చేరుకోలేకపోతున్నారు. రైతుభరోసా సాయం అందాలంటే జూన్ 30లోపు కౌలుకార్డు పొంది ఉండాలి. ఈలెక్కన మరో రెండు రోజుల్లో గడువు ముగుస్తున్నందున మెజారిటీ కౌలుదారులకు లబ్ధి అందేలా చూడాల్సి ఉంది. ఇందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడంతోపాటు అప్రమత్తం చేయాల్సిన తరుణమిదే. కౌలురైతులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు పేరుపొందింది. ఎకరం ఏడాది రూ.లక్షపైగా కౌలు ధర పలికే భూములు కూడా ఉన్నాయి. ఇందులో ఏడాది పొడవునా ఆకుకూరలు పండించి విజయవాడ, గుంటూరు నగరాలు, సమీప మున్సిపల్ పట్టణాల్లో రోజువారీగా విక్రయిస్తారు. ఏటికేడు కౌలురైతులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే వారికి కార్డుల మంజూరు, ఇతర సాయం అందడంలో జాప్యం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ