అధిక వడ్డీలకు జలగల్లా పీడిస్తూ..
గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు.
వేధింపులు తాళలేక పరారవుతున్న బాధితులు
కాల్మనీ వ్యాపారానికి పెట్టింది పేరైన గుంటూరులో అధిక వడ్డీలతో కొందరు ఫైనాన్స్ వ్యాపారులు జలగల్లా పట్టి పీడిస్తున్నారు. రాజకీయ అండదండలతో పేట్రేగిపోతున్నారు. తీసుకున్న మొత్తం వడ్డీతో సహా చెల్లింపులు చేసినా ఇంకా బకాయి ఉన్నావని బుకాయిస్తున్నారు.. ఆ మొత్తాన్ని చెల్లిస్తావా లేదా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. రోజు, నెలవారీ కిస్తీలు కడుతున్నా కట్టడం లేదని వారి నెత్తిన మరింత అప్పుల కుంపటి మోపుతున్నారు. కొందరు వ్యాపారుల వద్ద ఇల్లో, స్థలమో, బంగారమో కుదువ పెట్టి అప్పులు పొందిన వారు చివరకు వాటిని వదిలేసుకోవాల్సిందేనని వారి వ్యవహారశైలి తెలిసినవారు అంటున్నారు. అప్పటికీ వదలకపోతే బాధితులు ఊరు వదిలి పారిపోతున్నారు.
ఈనాడు, అమరావతి
ఇవీ సూక్ష్మంగా ఆగడాలు, మోసాలు..
గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు మూడు రోజుల క్రితం హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. అధిక వడ్డీలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని తను చనిపోతూ రాసిన సూసైడ్ నోట్లో ఉంది. ఆ లేఖను ఏపీ సీఎంకు అడ్రస్ చేస్తూ ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉంటున్నాయో అందులో ఉదహరించారు. ఆ వ్యాపారి ఆత్మహత్యతో గుంటూరులోని ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
కొందరి వద్ద అప్పులు తీసుకుంటే బతికున్నంత కాలం చెల్లించినా తీరవని, అంతలా మోసాలకు పాల్పడతారని నగరంలోని పండ్ల మార్కెట్కు చెందిన చిరు వ్యాపారి ఒకరు తెలిపారు.
పట్నంబజార్లోని పండ్లు, పూలు, డబ్బాలు తయారు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు భారీ స్థాయిలో వడ్డీలకు ఇస్తూ అపర కుబేరులుగా మారిపోయారు. పోలీసుల అక్రమ సంపాదనను కొందరు ఫైనాన్స్ వ్యాపారులు మార్కెట్లో తిప్పుతూ వారికి వడ్డీ ఆదాయాన్ని రుచిచూపుతున్నారని తెలుస్తోంది.
గుంటూరు పండ్ల మార్కెట్కు రోజూ లారీల్లో పెద్దఎత్తున దానిమ్మకాయలు, యాపిల్, అరటి ఇలా రకరకాల పండ్లు వస్తాయి. తొలుత లారీ సరకు మొత్తాన్ని ఒకరే కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు లారీ దానిమ్మ రూ.4లక్షలు ఉంటుంది. పండ్ల మార్కెట్లో మాత్రమే వడ్డీ వ్యాపారం చేస్తారని పేరున్న ఓ కార్పొరేటర్ బంధువు తెల్లవారుజామునే రూ.లక్షల కట్టలు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లతో అక్కడ వాలిపోతారు. ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావని బుకాయిస్తూ మరింతగా అప్పుల భారం మోపడంతో అన్నదమ్ములైన ఇద్దరు పండ్ల వ్యాపారులు తాజాగా నగరాన్ని వీడారని మార్కెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వీరికి అప్పులిచ్చిన ఫైనాన్స్ వ్యాపారి నూటికి 10 నుంచి 15 శాతం చొప్పున వడ్డీ విధించినట్లు చెబుతున్నారు.
ఒకేసారి రూ.లక్షో, రూ.2లక్షలో ఇచ్చి ఆ మొత్తంలో నుంచి నగదు ఇచ్చే సమయంలోనే 10 నుంచి 15 శాతం మొత్తాన్ని మినహాయించుకుని అప్పులిచ్చే విధానం మరికొందరు వ్యాపారులది. ఉదాహరణకు రూ.లక్ష అప్పు కావాలనుకుంటే అందులో పది శాతం అంటే రూ.10వేలు మినహాయించుకుని చేతిలో రూ.90వేలు పెడతారు. ఆ మొత్తాన్ని రోజుకు వెయ్యి చొప్పున వంద రోజుల్లో తీర్చేయాలి. ఆ లోపు తీర్చలేకపోతే తిరిగి రోజుకు వెయ్యి చొప్పున వడ్డీ మోపుతారు. ఈ విధానంలో శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ టిఫిన్ బండి నిర్వాహకుడు రూ.లక్ష అప్పు పొందారు. వంద రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించినా చెల్లించలేదని రోజువారీ వడ్డీభారం మోపడంతో గత కొద్ది రోజులుగా ఆ వ్యాపారి టిఫిన్ బండి సైతం పెట్టడం లేదని, ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో సహా కనిపించకుండా పారిపోయారని చెబుతున్నారు.
వేధింపులు మా దృష్టికి వచ్చాయ్..
పండ్లమార్కెట్లో కొందరు వ్యాపారులు అవసరానికి అప్పులు తీసుకుని చెల్లింపులు చేసినా చెల్లించలేదని, అధిక వడ్డీలతో ఇబ్బంది పెడుతున్నారని ఒకరిద్దరు ఫైనాన్స్ వ్యాపారులపై ఫిర్యాదులు వచ్చాయి. వారిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాం. ఇటీవల కాలంలో లోన్యాప్ల నుంచి రుణాలు పొందిన వారికి వేధింపులు బాగా ఉంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. ఆర్థిక అవసరాల కోసం అప్పులు తీసుకుని వాటిని తిరిగి చెల్లింపులు చేసేటప్పుడు మధ్యవర్తులను ఉంచుకోవాలి. చేసిన ప్రతి చెల్లింపు వివరాలు రాతపూర్వకంగా ఉంచుకోవాలి. ఆ మొత్తాన్ని వీడియో తీసి దగ్గర పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -సీతారామయ్య, డీఎస్పీ, గుంటూరు ఈస్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
[ 07-05-2024]
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
[ 07-05-2024]
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?