ఎవరో వస్తారని ఎదురు చూడక..
రెండేళ్లుగా సాగర్ కాలువలకు ఎలాంటి పనులు చేయలేదు.. నిధుల్లేక ఎన్నెస్పీ అధికారులు చేపట్టలేదు. గత ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభంలో నీటిని విడుదల చేయగా కాలువలో దట్టంగా పెరిగిన చిల్లచెట్లు, పూడిక ఉండడంతో నీటి సరఫరా సక్రమంగా
రైతులే స్వచ్ఛందంగా కాలువలో పూడిక
తొలగింపునకు శ్రీకారం
పర్చూరు, న్యూస్టుడే
నూతలపాడు - చింతగుంటపాలెం మధ్య కాలువలో
పొక్లెయిన్తో తొలగిస్తున్న చిల్లచెట్లు, పూడిక
రెండేళ్లుగా సాగర్ కాలువలకు ఎలాంటి పనులు చేయలేదు.. నిధుల్లేక ఎన్నెస్పీ అధికారులు చేపట్టలేదు. గత ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభంలో నీటిని విడుదల చేయగా కాలువలో దట్టంగా పెరిగిన చిల్లచెట్లు, పూడిక ఉండడంతో నీటి సరఫరా సక్రమంగా జరగక కట్టలు తెగి, పంట పొలాలను నీరు ముంచెత్తింది. మళ్లీ నీటిని విడుదల చేస్తే గత సంవత్సర పరిస్థితి పునరావృతమవుతుందని ఆలోచించారు. ఈక్రమంలో పర్చూరు మండలంలోని నూతలపాడు రైతులు దీనిపై చర్చించుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పొంచి ఉన్న ముంపు ప్రమాదానికి భయపడి సొంత నిధులు వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. నూతలపాడు-చింతగుంటపాలెం మధ్య నూతలపాడు మైనర్లో చిల్లచెట్లు తొలగించి, పూడిక తీసేందుకు తలా కాస్తా నిధులు సమకూర్చుకోవాలని తీర్మానించారు. అధికారులకు తమ అభిప్రాయాన్ని చెప్పి వారి సహకారంతో కాలువకు దక్షిణం వైపు ఉన్న రైతులు పొక్లెయిన్ ఏర్పాటు చేసుకొని, దాదాపు రెండు కి.మి. పొడవునా సాగర్ కాలువ మరమ్మతులు చేయించుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించారు. నూతలపాడు మైనర్ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా కాలువ పొడవునా ఇదే పరిస్థితి ఉంది. నూతలపాడుకు దిగువన కాలువ అడవిని తలపించేలా ఉంది. మరమ్మతులు చేయించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నా పొక్లెయిన్ అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.
సాగర్ కాలువలో దట్టంగా ఉన్న చిల్లచెట్లు
సాగర్ కాలువ అడవిని తలపించేలా ఉంది. చిల్లచెట్లు, పూడిక వల్ల నీటి సరఫరా జరగని పరిస్థితి. కాలువ మరమ్మతులు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగాం. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా పనులు చేపట్టలేదు. కాలువకు గండ్లు పడితే పంట పొలాలు ముంపునకు గురవుతాయని రైతులకు వివరించి స్వచ్ఛందంగా పనులు చేయించుకునేలా ఒప్పించాం. - శ్రీరామచంద్రమూర్తి, నూతలపాడు రైతు
సాగర్ కాలువకు గండి పడి గత ఏడాది పంట సాగు సమయంలోనే పొలాలు దెబ్బతిన్నాయి. వేసవిలో కాలువ మరమ్మతులు చేయిస్తారని ఆశించాం. ప్రజాప్రతినిధులు, ఎన్నెస్పీ అధికారులకు పలుమార్లు సమస్య తీవ్రతను వివరించాం. ఫలితం లేకపోవడంతో కాలువ పరిధిలోని రైతులు తలా కాస్తా నిధులు సమకూర్చుకొని పనులు చేయించుకోవాలని నిర్ణయించుకున్నాం. - పోలూరి శ్రీనివాసరెడ్డి, రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధ్యత మరిచారు.. భ్రష్టు పట్టించారు!
[ 05-05-2024]
పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్ పక్కనే గంజాయి బ్యాచ్లు చెలరేగుతున్నా జగన్ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 05-05-2024]
‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. -
ఎగసిన ‘జన’ కెరటం
[ 05-05-2024]
రేపల్లె తీర ప్రాంతానికి జనసేనాని రాకతో అభిమాన జన కెరటం ఉవ్వెత్తున ఎగసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చిన జనాలతో రేపల్లె పట్టణం కిక్కిరిసింది. తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆధ్వర్యంలో శనివారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పవన్కల్యాణ్ హాజరయ్యారు. -
గుండెలదిరేలా గ్రామాల రోడ్లు
[ 05-05-2024]
-
ఏళ్లుగా సడలని సంకల్పం
[ 05-05-2024]
మొక్కవోని దీక్ష, పట్టుదలతో అమరావతిని కాపాడుకోవడం కోసం అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 1600 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పంటిబిగువున ఎత్తిన చెయ్యి దించకుండా ప్రతి దశలోనూ మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. -
‘జలకళ’లో జగన్ దగా
[ 05-05-2024]
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. -
‘మోసానికి’ బ్రాండ్ అంబాసిడర్
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. -
సీలు వేశాం.. కానీ ఊడిపోయింది..!
[ 05-05-2024]
-
ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మిన్నకుండిపోయారు
[ 05-05-2024]
-
వైకాపా నేతలపై చర్యలకు డిమాండ్
[ 05-05-2024]
పొన్నూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు హెలీప్యాడ్ను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఎ.ఎస్.రామకృష్ణ తదితరులు. -
సూపర్-6తో అపూర్వ ప్రగతి
[ 05-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్నిరంగాలు, వర్గాల ప్రజలు దగా పడ్డారు. దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, హత్యలు, అరాచకాలు అడ్డులేకుండా పోయాయి. ప్రగతి కనుచూపు మేరలో కానరాలేదు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. -
కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల
[ 05-05-2024]
పట్టణంలోని యడ్లలింగయ్య, ఫులె కాలనీల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజీ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
వైకాపా నాయకుల కవ్వింపు చర్యలు
[ 05-05-2024]
తాడికొండ మండలం మోతడక గ్రామంలో శనివారం వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఖాళీ ప్రచార రథంతో పాటు వైకాపా అల్లరి మూక వచ్చారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
[ 05-05-2024]
రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 9న తిరుపతిలో 20.20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07510) తెనాలి 01.58, గుంటూరు 02.20, నడికుడి 04.00, సికింద్రాబాద్ 09.10 గంటలకు చేరుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు