తప్పు ఎవరిదైనా.. శిక్ష ఉపాధ్యాయులకే..
ఉపాధ్యాయులకు ఆదాయ పన్ను, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) జమ కాలేదని తాకీదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ఐటీ, పీఎఫ్ జమకాక ఇక్కట్లు
ఈనాడు-అమరావతి
ఉపాధ్యాయులకు ఆదాయ పన్ను, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) జమ కాలేదని తాకీదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరూ సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. చివరకు జీతాల బిల్లులు పాస్ చేయాల్సిన ఖజానా అధికారులు సమ్మెబాట పట్టడంతో ఆ నెలలో ఉద్యోగులకు సంబంధించిన జీతాలను ప్రభుత్వమే నేరుగా ఉద్యోగి ఖాతాలోకి జమ చేసింది. దీంతో ఆనెలలో ఉద్యోగుల నుంచి మినహాయించాల్సిన ఆదాయపన్ను, ప్రావిడెంట్ ఫండ్ వివరాలను సంబంధిత శాఖలకు పంపలేదు. ప్రస్తుతం ఆ నెలకు సంబంధించి చెల్లించలేదని సూచిస్తూ కొందరు ఉద్యోగులకు నోటీసులు అందాయి.
ప్రధానంగా ఐటీశాఖ నుంచి నోటీసు పంపి అందులో మీరు కట్టాల్సిన డ్యూ ఇంత అని స్పష్టంగా పేర్కొంటున్నారు. పీఎఫ్కు సంబంధించి డీడీఓలకు ఫోన్లు చేసి ఆనెలలో ఎంతమంది ఉద్యోగులకు పీఎఫ్ ఎంత మినహాయించారో వివరాలు సమర్పించలేదని, అందుకే ఈనెలలో పీఎఫ్ ఖాతాలను సర్దుబాటు చేయలేదని చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు జవనరి నెలలో సొమ్ములు సర్దుబాటు కాలేదని పీఎఫ్ క్లోజర్ పెట్టుకోవటానికి వీల్లేకుండా పోయింది. మొత్తంగా పదవి విరమణ ఉద్యోగులకు పీఎఫ్ క్లోజర్స్ పెట్టుకోవటానికి అవకాశం లేకుండా పోవటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి
ఈ సమస్యపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. కనీసం ఉద్యోగ విరమణచేసిన వారికి జనవరి నెలలో పీఎఫ్ వివరాలు అందలేదని క్లోజర్స్ పెట్టుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. బాధిత ఉపాధ్యాయులు విరమణ డబ్బులతో ఏదైనా ఇల్లు, ప్లాటు కొనుక్కోవాలని ఆశపడి చివరకు భంగపాటుకు గురవుతున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,