జిల్లా ప్రగతికి కృషి చేద్దాం
గుంటూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
74వ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే
జాతీయజెండా ఆవిష్కరిస్తున్న జిల్లా పాలనాధికారి వేణుగోపాల్రెడ్డి
గుంటూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. 74వ గణతంత్ర వేడుకలను గురువారం పోలీసు కవాతు మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరించారు.
వ్యవసాయం: వైఎస్సార్ రైతు భరోసా పథకం, పీఎం కిసాన్ పథకాల ద్వారా 2022-23 సంవత్సరానికి 1,19,631 మంది రైతులకు రూ.51.61 కోట్లను పెట్టుబడి సాయంగా అందించామన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా పంట రుణాలు సకాలంలో చెల్లించిన 15,220 మంది రైతులకు రూ.2.75 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చామన్నారు. గతేడాది కురిసిన వర్షాలతో నష్టపోయిన 460 మందికి రూ.38 లక్షల పెట్టుబడి రాయితీ అందించామన్నారు.
బ్యాంకులు: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2022-23లో ప్రాధాన్య రంగాలకు రూ.16,932 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యం రూ.4,893 కోట్లు కాగా.. సెప్టెంబర్ నాటికి రూ.3,190 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.1,675 కోట్లు కాగా.. సెప్టెంబర్ వరకు రూ.2,090 కోట్ల రుణాలను అందజేశారన్నారు.
వైద్యారోగ్య శాఖ: ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని జిల్లాలోని 211 గ్రామాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజనతో 5300 మందికి రూ.2.98 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో 3,255 జబ్బులకు రూ.431 కోట్లతో 1.79 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు. ఆరోగ్య ఆసరా ద్వారా 70,591 మందికి రూ.42 కోట్లను రోగులకు శస్త్ర చికిత్స అనంతరం జీవనోపాధి భృతిగా అందించామన్నారు.
విద్యాశాఖ: మనబడి నాడు నేడు ఫేజ్-2లో జిల్లాలో 563 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు రూ.208 కోట్లతో 838 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జగనన్న విద్యాకానుక కిట్లను జిల్లాలోని 1,097 పాఠశాలల్లోని 1,13,521 మంది విద్యార్థులకు అందించామన్నారు.
జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ: జిల్లాలో కొత్తగా 8,300 పింఛన్లు మంజూరు చేశామన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో 18,360 మందికి రూ.902 కోట్లను మంజూరు చేశామన్నారు. స్త్రీ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 17,167 మంది స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.68 కోట్లు రుణంగా అందించామన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన
పంచాయతీరాజ్ శాఖ: జిల్లాలో ప్రాధాన్య భవనాల నిర్మాణం మొత్తం 825 పనులకు రూ.188 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు 139 పనులు పూర్తయ్యాయన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం: ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించిన 653 పనులను రూ.42 కోట్లు మంజూరయ్యాయన్నారు.
కారుణ్య నియామకాలు: వివిధ శాఖల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 81 మందికి, మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 26 మందికి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించామన్నారు.
గృహనిర్మాణ శాఖ: జిల్లాలో 209 వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లేఔట్లలో 67,678 గృహాలను చేపట్టామని, రూ.1,218 కోట్లను కేటాయించామన్నారు. జిల్లాలో 13,381 గృహాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్, జిల్లా సంయుక్త కలెక్టర్ జి.రాజకుమారి, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్, గుంటూరు నగర కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఏఎస్పీలు అనీల్, సుప్రజ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, డీఆర్వో కె.చంద్రశేఖర్రావు, జిల్లాపరిషత్తు ఛైర్పర్సన్ కత్తెర క్రిస్టినా, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?