బల్లకట్లు వేలానికి రెండోసారీ గైర్హాజరు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మాదిపాడు, పుట్లగూడెం, గోవిందాపురం బల్లకట్లు 2023-24 ఏడాదిలో నిర్వహణకు జిల్లాపరిషత్తు అధికారులు నిర్వహించిన వేలానికి గుత్తేదారులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు.
గుత్తేదారుల కోసం ఎదురు చూస్తున్న జడ్పీ ఉద్యోగులు
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైన మాదిపాడు, పుట్లగూడెం, గోవిందాపురం బల్లకట్లు 2023-24 ఏడాదిలో నిర్వహణకు జిల్లాపరిషత్తు అధికారులు నిర్వహించిన వేలానికి గుత్తేదారులు మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. జిల్లాపరిషత్తు కార్యాలయంలో మంగళవారం రెండోసారి మూడు బల్లకట్లుతో పాటు కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, అచ్చంపేట మండలం మాదిపాడు పడవలకు వేలం నిర్వహించారు. బల్లకట్లుతో పాటు మున్నంగి, మాదిపాడు పడవలకు గుత్తేదారులు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. గుత్తేదారుల కోసం జడ్పీ ఉద్యోగులు సాయంత్రం 5 గంటల వరకు ఎదురు చూసినప్పటికీ వల్లభాపురం పడవకు ఇద్దరు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా నడకుదిటి చిన సుబ్రహ్మణ్యం అనే గుత్తేదారు రూ.1,01,000కు పాట పాడటంతో అధికారులు ఆయన పేరిట ఖరారు చేశారు. మూడు బల్లకట్లు ద్వారా జిల్లాపరిషత్తుకు రూ.కోటి వరకు ఆదాయం వస్తుందని పాలకవర్గం, అధికారులు భావించగా గుత్తేదారులు స్థానిక అధికార పార్టీ నాయకుల మద్దతుతో అనధికారికంగా బల్లకట్లు, పడవలను నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయడం లేదు. జడ్పీ అధికారులు ఇప్పటికి రెండు సార్లు టెండర్లు, బహిరంగ వేలం నిర్వహించినా ఒక్కరు కూడా వేలంలో పాల్గొనకపోవడం గమనార్హం. బయటి వ్యక్తులు ఎవరైనా టెండర్లు వేసేందుకు ముందుకు వస్తే వారిని స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికార పార్టీ నాయకులు సమ్మతిస్తేనే వేలంలో పాల్గొనాలని, లేకుంటే ఎవరూ పాల్గొనకూడదని స్పష్టం చేయడంతో గుత్తేదారులు వెనుకాడుతున్నారు. అంతిమంగా జిల్లాపరిషత్తు ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. పాలకవర్గం, అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
[ 07-05-2024]
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
[ 07-05-2024]
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?