‘పేదలకు పనికిరాని స్థలాలు ఇచ్చారు’
ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.
మాజీ మంత్రి ఆలపాటి
పట్టాభిపురం (గుంటూరు), న్యూస్టుడే: ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఒక్క తెనాలిలోనే వైకాపా నేతలు రూ.150 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్లస్థలాల పంపిణీ అంటూ 48 గజాలు పేదలకు అంటగట్టారు. ఉగాదికి పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి శ్రీరామనవమి ముగిసినా అతీగతీ లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు తప్ప జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1987 ఇళ్లను మాత్రమే సిద్ధం చేసి పేదలకు లక్షల్లో ఇళ్లు ఇచ్చామని మోసం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఎందుకు పనికిరాని స్థలాలను పేదలకు ఇచ్చారు. సరిగ్గా ఇళ్ల నిర్మాణం చేయకుండా లబ్ధిదారులను డబ్బు చెల్లించమని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో వైకాపా ప్రభుత్వం కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకుంది. ఆ డబ్బును ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే వరకు ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు పిల్లి మాణిక్యరావు, దాసరి రాజామాస్టారు, చిట్టాబత్తిన చిట్టిబాబు, దామచర్ల శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్, కల్లూరి శ్రీనివాసరావు, బొబ్బిలి రామారావు, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు
[ 10-05-2024]
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. -
వైకాపా ప్రలోభాల పర్వం.. మంగళగిరిలో రూ.25కోట్లు సీజ్
[ 10-05-2024]
పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. -
సూపర్-6తో భవిష్యత్తు గ్యారెంటీ
[ 10-05-2024]
‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఇక్కడ నివసిస్తున్న వివిధ వృత్తుల వారు చేసే పనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆదాయం పెరిగేలా చేస్తాం. ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి అక్కడ పని చేసుకోవడానికి అన్ని వసతులు.. -
ఈ అరాచకాల్ని.. ఆపేదెవరు..?
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కత్తిమీదసాములా మారింది. -
అన్నవి హామీలే.. కర్షకులకు కష్టాలే
[ 10-05-2024]
జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. కోత కోసి ఓదెల మీద ఉన్న వరి పనలు తడిచిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగి నష్టం జరిగింది. -
ప్రతీ నెలా నిరీక్షణే.. జీవితకాలం నష్టమే..
[ 10-05-2024]
2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2022లో పీఆర్సీని ప్రకటించారు. 11వ పీఆర్సీలో ఫిట్మెంట్ 23 శాతానికి ప్రభుత్వం తగ్గించడంతో విశ్రాంత ఉద్యోగుల పింఛన్లో 4 శాతం కోత పడింది. -
బరితెగించిన వైకాపా
[ 10-05-2024]
గుంటూరు నగరంలో వైకాపా తరఫున బరిలో నిలిచిన అభ్యర్థి బరి తెగించారు. ప్రజల నుంచి మద్దతు లేదని గుర్తించిన సదరు వ్యక్తులు అడ్డదారుల్లోనైనా గెలవాలనే లక్ష్యంతో సామ, దాన, దండోపాయాలు అవలంబిస్తున్నారు. -
నా సోదరి మాధవిని గెలిపించండి
[ 10-05-2024]
గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన నా సోదరి గళ్లా మాధవిని గెలిపించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. జనసేన కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె పవన్ కల్యాణ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
ఐఎఫ్ఎస్కు నడింపల్లి యువతి ఎంపిక
[ 10-05-2024]
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో చెరుకుపల్లి మండలం నడింపల్లికి చెందిన వెన్నం అనూష 73వ ర్యాంక్ సాధించారు. ఎన్నో ప్రయత్నాల తరువాత ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. -
అంతర్ జిల్లాల బ్యాలట్లు గల్లంతు
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలట్ మొదలైనప్పటి నుంచి అంతర్ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. -
మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే
[ 10-05-2024]
మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
దోశలో ఇనుప వాషర్ బోల్ట్
[ 10-05-2024]
గుంటూరులోని కొందరు హోటల్స్ నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గురువారం కొరిటెపాడులోని ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వినియోగదారుడికి ఎదురైన సంఘటనే తార్కాణం. -
రోశయ్య, ఆళ్ల మాట తప్పారు
[ 10-05-2024]
పెదకాకాని హజరత్ సయ్యద్ బాజిషహీద్ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. -
‘వైకాపా అభ్యర్థులను అన్ని చోట్లా ఓడించండి’
[ 10-05-2024]
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ దళితుల్ని నిలువునా వంచించారని ప్రభుదా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్,
తాజా వార్తలు (Latest News)
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం
-
ఫ్రెండ్షిప్ మ్యారేజ్.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్!
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!