ప్రీమియం చెల్లిస్తేనే పరిహారం
గతంలో పశువులు చనిపోతే పరిహారం ఇచ్చేవారు. దీన్ని పశు నష్టపరిహారంగా పిలిచేవారు. ప్రస్తుతం వైఎస్సార్ పశు బీమాగా పేరు మార్చి.. నిబంధనలు మార్చారు.
పశు బీమా పథకంలో మార్పులు
పోషకుల్లో అనేక సందేహాలు
చిలకలూరిపేట గ్రామీణ, వినుకొండ, క్రోసూరు, న్యూస్టుడే
గతంలో పశువులు చనిపోతే పరిహారం ఇచ్చేవారు. దీన్ని పశు నష్టపరిహారంగా పిలిచేవారు. ప్రస్తుతం వైఎస్సార్ పశు బీమాగా పేరు మార్చి.. నిబంధనలు మార్చారు. ఈ పథకం ప్రకారం బీమా చేయించుకుంటేనే పరిహారం అందుతుంది. పాత పద్ధతిలో ఎన్ని పశువులకైనా ఇచ్చేవారు. కొత్తదాని ప్రకారం లక్ష్యం కూడా నిర్దేశించారు. దీంతో అందరికీ ఈ పథకం అందుతుందో.. లేదోననే సందేహం పశుపోషకులు వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా ఇలా..
కొత్త బీమా పథకం అమలు చేసేందుకు ఇండియా బీమా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రేషన్ కార్డు కలిగిన రైతులు రూ.30 వేల విలువ చేసే పశువుకు మూడేళ్ల కాలపరిమితికి రూ.384 చెల్లించాలి. అదే పెద్ద రైతులైతే రూ.960 కట్టాలి. రూ.30 వేల కంటే ఎక్కువ ధర ఉన్న పశువులకు అదనంగా 6.4 శాతం ప్రీమియం చెల్లించాలి. ఒక రైతు రూ.లక్షకు బీమా ప్రీమియం చెల్లించినా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల వరకు మాత్రమే బీమా పరిహారం అందిస్తుంది. అంతకుమించి ఇవ్వదు.
గొర్రెలు, మేకలకు ఏడాదికి.. రెండేళ్లు.. మూడేళ్లకు బీమా చేయించుకోవచ్చు
ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (తెల్ల రేషన్కార్డు కలగిన) రైతులు ఒక గొర్రె లేదా మేకకు ఏడాదికి రూ.36, రెండేళ్లకు రూ.54, మూడేళ్లకు రూ.75 ప్రీమియం చెల్లించాలి. అదే పెద్ద రైతులైతే ఏడాదికి ఒకదానికి రూ.90, రెండేళ్లకు రూ.135, మూడేళ్లకు రూ.187.50 చెల్లించాలి. గొర్రెలు, మేకలు చనిపోతే ఒక్కోదానికి రూ.6 వేల చొప్పున బీమా పరిహారం చెల్లిస్తారు.
నిబంధనలు ఇలా..
* వైఎస్సార్ పశుబీమా పథకంలో భాగంగా ఆవులు, గేదెలు, కొత్తగా ఎద్దులు, గొర్రెలతో పాటు పందులను కూడా చేర్చారు. ఈ పథకంలో ఎద్దులు, పందులు లేవు. ఆవులు రెండేళ్ల నుంచి పదేళ్లలోపు వయసు ఉండాలి. ఒక ఈత పాలిచ్చినవై ఉండాలి. గేదెలు 3 నుంచి 12 ఏళ్ల వయసులో ఉండాలి. అవి కూడా ఒక ఈత పాలు ఇచ్చినవై ఉండాలి.
* ఎద్దులు, దున్నపోతులు పనిచేసేవి ఉండాలి. విదేశీజాతికి ఏడాదిన్నర నుంచి పదేళ్లు.. దేశీయ జాతికైతే రెండేళ్ల నుంచి పదేళ్లు ఉండాలి. గొర్రెలు మేకలు, పందులైతే 50 వరకు బీమా చెల్లించుకోవచ్చు.
* 2023-24 ఆర్థిక సంవత్సరానికి గొర్రెలు, మేకలు, పశువులు, పందులు అన్ని రకాలు కలిపి ఒక్కో నియోజకవర్గానికి 2500 లోపు మాత్రమే బీమా చేయాలని లక్ష్యం నిర్దేశించడం గమనార్హం. గతంలో ఇలాంటి నిబంధన లేదు.
* పశు పోషకులకు మేలు చేస్తుంది. వైఎస్సార్ పశు బీమా పథకం పశు పోషకులకు మేలు చేస్తుంది. పశువులకు కచ్చితంగా ట్యాగ్ వేయించుకోవాలి. సకాలంలో ప్రీమియం చెల్లించాలి. ఆ పశువులు చనిపోయినప్పుడే బీమా పరిహారం అందుతుంది. పథకం పారదర్శకంగా అమలవుతుంది. ఈ పథకం పట్ల పశు పోషకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే రైతులు దరఖాస్తులు కావాలని పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఆసక్తి ఉన్న వారంతా సంబంధిత వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలి. సంబంధిత పశువుల ఆసుపత్రుల్లో వివరాలు తెలుసుకోవచ్చు.
శ్రీనివాసరావు, ఏడీ, పశుసంవర్ధక శాఖ, చిలకలూరిపేట.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి: నారా రోహిత్
[ 07-05-2024]
ఏపీ ప్రజలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి, రాష్ట్రంలో రాక్షస పాలనను అంతం చేయాలని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్లో తప్పిదం.. ఇద్దరు అధికారులపై చర్యలు
[ 07-05-2024]
పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి