ఫోన్ పోయిందా.. ఇట్టే దొరుకుతుంది
ఆండ్రాయిడ్ చరవాణి లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి నేటి తరానిది. కనీసం ఎంత లేదన్న రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ఖర్చు పెట్టి వీటిని కొంటున్నారు.
సీఈఐఆర్ వెబ్సైట్ లో నమోదుతో రికవరీ
అవకాశం కల్పిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులు
సీఈఐఆర్ వెబ్ సైట్
నరసరావుపేట టౌన్, న్యూస్టుడే: ఆండ్రాయిడ్ చరవాణి లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి నేటి తరానిది. కనీసం ఎంత లేదన్న రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ఖర్చు పెట్టి వీటిని కొంటున్నారు. విలువైన వస్తువు కావడంతో చాలా భద్రంగా చూసుకుంటారు. దురదృష్టవశాత్తు పొగొట్టుకున్నా, చోరీకి గురైనా ఇక మానసిక వేదనే. కొంత మంది చరవాణి కంటే కూడా అందులో నిక్షిప్తం చేసుకున్న డేటా కోసం విలవిలలాడుతుంటారు. ప్రయాణాలు, జనరద్దీలో పొరపాటున జారిపోవడం, దొంగలు అపహరించడం వంటి సంఘటనలు ఎదురువుతున్నాయి. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా తేలిగ్గా తీసుకుంటున్నారు. దొరికితే ఇస్తామంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు ఇలాంటి చరవాణుల జాడ పసిగట్టి బాధితులకు చేర్చేందుకు ఓ వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం మంత్రిత్వ శాఖ సహకారంతో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ www.ceir.gov.in అనే వెబ్సైట్ ద్వారా పల్నాడు జిల్లాలో పోయిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రజలకు అందించేందుకు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. చరవాణి పని చేస్తుంటే 24 గంటల వ్యవధిలో వెతికి పట్టుకుంటారు. చరవాణిలోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా స్తంభింపజేస్తారు.
బాధితులు చేయాల్సింది ఇలా..
బాధితులు ముందుగా వారికి సంబంధించిన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.www.ceir.gov.in అనే వెబ్సైట్ లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్ /స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, చరవాణి నెంబరు, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, చరవాణి కొనుగోలు రసీదు అప్ లోడ్ చేయాలి. చరవాణి ఏ రోజు, ఎక్కడ పోయిందన్న చిరునామాతో పాటు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారు పేరు, చిరునామా, గుర్తింపు కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందినవి) ఈ మెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో చరవాణి నంబర్ ఇవ్వాలి. ఈ ప్రక్రియ అయ్యాక ఒక ఐడీ నెంబర్ వస్తుంది. దీంతో సంబంధిత ఐడీ చరవాణి స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ సీఈఐఆర్ వ్యవస్థతో పోయిన ఏ కంపెనీ చరవాణినైనా 24 గంటల్లోపు పని చేయకుండా చేయవచ్చు. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారు అదే వెబ్సైట్ లోకి వెళ్లి అక్ /ఫౌండ్ మొబైల్ అనే లింక్పై క్లిక్ చేసి, ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
చరవాణి పోయిన వెంటనే వారి పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈఐఆర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలి. చరవాణి వినియోగిస్తున్న వారికి సీఐఈఆర్ వెబ్సైట్ గురించి తెలిసేలా పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తారు. 24 గంటల్లో వెతికి పట్టుకోవచ్చు. వ్యక్తిగత సమాచారం (డేటా) దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. పల్నాడు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
వై.రవిశంకర్రెడ్డి, ఎస్పీ, పల్నాడు జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్