పోలీసు.. వైకాపాకు వత్తాసు
సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.
అధికార పార్టీ నేతలకు మేలు చేసేలా నిర్ణయాలు
ఎంసీసీ బృందాలపై విమర్శలు
సీఐ.. ఎస్సైలకు చెక్పోస్టు విధులు
ఈనాడు-బాపట్ల: సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది. వారికి రోజు మార్చి రోజు ఆ డ్యూటీలు వేయడంతో స్టేషన్ పరిధిలో జరిగే ఘటనలపై వారు దృష్టిసారించలేకపోతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెక్పోస్టుల వద్ద పహారా కోసం అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వారిని కాదని శాంతిభద్రతల విభాగంలో ఉండే పోలీసుల్ని పంపడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో లా అండ్ ఆర్డర్లో పని చేసే రెగ్యులర్ ఎస్సై, సీఐలను రోజు మార్చి రోజు చెక్పోస్టు డ్యూటీలకు పంపుతున్నారు. ఇదే అదనుగా ఆయా స్టేషన్ల పరిధిలో అధికారులు లేకుండా చూసి కొందరు వైకాపా అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఎవరైనా తాయిలాలు పంపిణీ చేస్తున్నారని స్టేషన్కు సమాచారమిచ్చినా ఎస్సై, సీఐలు లేరని చెప్పి పంపిణీ క్రతువు ముగిశాక ఆలస్యంగా చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగానే లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేకించి ఆయా స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఈ డ్యూటీలు వేయడం గమనార్హం. ఇలా చేయడం అంటే కొందరు అభ్యర్థులకు మేలు చేయటమేనని వినికిడి. ఇప్పటికే జిల్లాలో కొందరి పోలీసుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా తీరు మార్చుకోవడం లేదు. ఆ మధ్య బల్లికురవ ఎస్సై స్టేషన్లోనే అధికార వైకాపా నాయకులతో శాలువా కప్పించుకున్నారు. దీన్నిబట్టి అధికార వైకాపాతో పోలీసులు ఎలా అంటకాగుతున్నారో ఆ ఉదంతం చెప్పకనే చెబుతోంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారా? లేదా? ఏమైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా? ప్రచారాలకు వినియోగించే వాహనాలకు అనుమతులు ఉన్నాయా లేవా అనేవి పరిశీలించడానికి ఎంసీసీ బృందాలు ఉన్నాయి. ఆ బృందాల్లో పోలీసులు ఉంటారు. ఎవరైనా తాయిలాలు పంపిణీ చేసినా, వాహనాలు అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేస్తున్నా వాటిని గుర్తించి సీజ్ చేయాల్సింది ఎంసీసీ బృందాలే. అయినా ఇటీవల పర్చూరు నియోజకవర్గం పూనూరులో ఓ ఆటోకు ఫ్లెక్సీ ఉందని దానికి అనుమతులు ఉన్నాయోలేవో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆ వాహనాన్ని సీజ్ చేయాలని ఎంసీసీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనధికార ఆటోను గుర్తించి కూడా పక్కన పెట్టించకుండా వాహనాన్ని వదిలేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది అధికార పార్టీకి సంబంధించిన ఆటో కావడం వల్లే ఎంసీసీ బృందం దాన్ని ఆపకుండా మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల నుంచి ఎంసీసీ బృందాల వరకు అధికార వైకాపా వారి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో కూడా తెదేపా సానుభూతిపరుడి ఇంట్లో డబ్బుల కట్టలు ఉన్నాయని పోలీసులు వచ్చి హడావుడి చేశారు. విపక్షాలను అణగదొక్కటమే లక్ష్యంగా పోలీసులు తీరు ఉందని తెదేపా వర్గాలు ఆరోపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యానిఫెస్టో మీ ముందుపెట్టాం.. ఆశీర్వదించండి: ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి
[ 30-04-2024]
‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మ్యానిఫెస్టోను మీ ముందు పెట్టాం. తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. -
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM