అయిదేళ్లుగా చోద్యం చూశారు!
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి.
వంతెనకు పగుళ్లు.. ప్రయాణానికి దిగులు
పగుళ్లిచ్చిన వంతెన అడుగు భాగం దిమ్మె
భట్టిప్రోలు, న్యూస్టుడే : ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన ఇది. శిథిలావస్థకు చేరి అడుగు భాగం దిమ్మెలు పగుళ్లిచ్చాయి. ఇనుప రాడ్ల ఆధారంగా నిలబడింది. భారీ వాహనాలు ప్రయాణిస్తే దిమ్మెలు కదులుతున్నాయి. మండలంలోని పల్లెకోన గ్రామంలో మురుగుకాల్వపై నిర్మించిన వంతెన పరిస్థితి ఇది. రేపల్లె-భట్టిప్రోలు ప్రధాన రహదారి మార్గం కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పటికే కోనేటిపురం వైపు కొంత కుంగింది. వాహనాలు ప్రయాణించే సమయంలో వంతెన ఊగుతోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ నిర్వహించిన మంత్రి మేరుగు నాగార్జునకు నూతన వంతెన నిర్మించాలని గ్రామస్థులు విన్నవించారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. మురుగుకాల్వలో నీరు ఉద్ధృతంగా ఉన్నప్పుడు దిమ్మెలు బలహీనపడి వంతెన కూలుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. కాలం చెల్లిన వంతెనపై ప్రయాణిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా నూతన వంతెనకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈవిషయమై ఆô్అంè్బీ ఏఈ కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఈ రహదారిని జాతీయ రహదారి కింద గుర్తించారని తెలిపారు. తిరిగి ఆô్అంè్బీకి అప్పగిస్తే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరవుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.