జీతాలకూ ఎదురుచూపులే..
జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.
ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రతి నెలా ఇబ్బందులు
- జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి జీతాలు రాలేదు. ఏప్రిల్ నెల జీతంతో కలిపి రెండు నెలల బకాయిలు విడులవుతాయన్న నమ్మకం లేదు.
- జిల్లా బీసీ కార్పొరేషన్ ఉద్యోగులకు గత ఏడాది 2023, అక్టోబరు నుంచి 2024, మార్చి నెల వరకు జీతాలు విడుదల కాలేదు. సిబ్బంది ఆర్థికంగా ఇబ్బంది పడడంతో జిల్లా అధికారి అందుబాటులో ఉన్న నిధుల నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలకు అడ్వాన్స్ కింద చెల్లించారు. వేతనాలు విడుదలైన తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
- జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులకు జనవరి నుంచి మార్చి, ఉపాధి హామీ ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు జమ కాలేదు.
జిల్లాపరిషత్తు (గుంటూరు), కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నెలలో ఒకటో తేదీన జీతం తీసుకున్న సందర్భాలు వేళ్ల మీద లెక్కించాల్సిందే. ఒకప్పుడు నెలలో ఒకటో తేదీ వస్తుందంటే ఉద్యోగులకు జీతాలు వస్తాయన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏ నెలలో జీతం ఆ నెలలో వస్తుందన్న నమ్మకం లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఓ క్రమబద్ధమైన జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. నెలవారీ కుటుంబ ఖర్చులు, పిల్లల ఫీజులు ఇతరత్రా ఖర్చులను లెక్క వేసుకుని వ్యయం చేస్తుంటారు. అయిదేళ్లలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు నెలలో 1న జీతాలు జమ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 5వ తేదీ తర్వాత వేస్తున్నారు. ఎక్కువ మందికి 10 నుంచి 20వ తేదీ లోపు విడుదల చేస్తుండటంతో బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఇతరత్రా అప్పులకు సంబంధించి నెల వారీ కిస్తీలు, ఈఎంఐలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు ఆయా తేదీల్లో చెల్లించకపోతే బ్యాంకులు అపరాధ రుసుం విధిస్తున్నాయి. దీనికితోడు రుణాత్మక పాయింట్లతో సిబిల్ స్కోర్ పడిపోయి భవిష్యత్తులో రుణాలు పొందడానికి అవరోధంగా మారుతోంది. పిల్లలుంటే.. పాఠశాల, కళాశాలల్లో టర్మ్ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. నెలలుగా జీతాలు విడుదల చేయకపోవడంతో కుటుంబాల అవసరాలు తీర్చడానికి ప్రైవేటు వ్యక్తులు, సూక్ష్మ రుణ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. 1 నుంచి 5వ తేదీ లోపు జీతాలు వస్తే అప్పులు తీర్చి మిగిలిన డబ్బులతో కుటుంబాలను పోషించుకోవచ్చని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
జాప్యంతో ఇక్కట్లు
మూడు నెలలకోసారి వేతనాలు విడుదల చేస్తుండడంతో ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు తయారు చేసేందుకు సరకులు సరఫరా చేసే వారికి నాలుగైదు నెలలకు బిల్లులు విడుదల చేస్తుండటంతో నిర్వహణ కష్టంగా మారింది. గురుకులాల్లో 13 ఏళ్లుగా పని చేస్తున్న ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోవడంతో వందలాది మంది నష్టపోయారు. కేవలం సొసైటీలు పరిధిలో పని చేస్తున్నామనే కారణంతో ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు అమలు చేయడం లేదు.
డి.మధుసూదనరావు, రాష్ట్ర గురుకులాల జేఏసీ ఛైర్మన్
సమస్యలు పరిష్కరించలేదు
సాంఘిక సంక్షేమ గురుకులాల ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు విడుదల చేయలేదు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు వర్తింపజేయకపోవడంతో వందల మంది నష్టపోయారు. ఒప్పంద ఉపాధ్యాయులు, అధ్యాపకులను 010 పద్దు నుంచి జీతాలు తీసుకోవడం లేదనే కారణంతో రెగ్యులర్ చేయకపోవడం బాధాకరం. విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి మాత్రం 62 ఏళ్లకు పెంచారు. పార్ట్ టైం టీజీటీలకు రూ.18 వేలు, పీజీటీలు, జేఎల్స్కు రూ.24 వేలు చెల్లిస్తున్నారు. 2019 నుంచి మెడికల్ అలవెన్స్ రూ.900 చెల్లించడం లేదు. మూడేళ్ల నుంచి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రినిపల్స్ పదోన్నతులు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నారు. నివాసయోగ్యంగా లేని క్వార్టర్లకూ పూర్తి స్థాయి హెచ్ఆర్ఏ మినహాయించేలా ఉత్తర్వు తీసుకురావడంతో నష్టం జరుగుతుంది.
దాసరి ప్రభాకర్, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత