సమస్యలు విలీనమై.. బడికి దూరమై..
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు.
ప్రైవేటు బాట పడుతున్న బడి పిల్లలు
పేద విద్యార్థులకు అందుబాటులో లేని పాఠశాలలు
సుదూరాలకు పంపలేకపోతున్న తల్లిదండ్రులు
ఈనాడు-బాపట్ల, న్యూస్టుడే - వేమూరు, కొల్లూరు
3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించి పాఠశాల విద్యలో నాణ్యతను పెôచుతాం.
పాఠశాలల విలీనం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలివి.
పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. అందుబాటులో బడి లేక ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబు గుల్లవుతుంది. ప్రైమరీలో ప్రవేశాలు తగ్గటంతో స్కూళ్లు మూతపడే ప్రమాదం ఏర్పడింది. విలీనం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్న మాట.
పాఠశాలల విలీనం పేరుతో కాలనీలో ఉన్న స్కూల్ను తీసుకెళ్లి ఎక్కడో సుదూరాన ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో చిన్న పిల్లల్ని అంత సుదూరాలకు పంపలేమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. విలీనంతో ప్రవేశాల సంఖ్య బాగా తగ్గింది. నాణ్యమైన బోధన అటకెక్కింది. ప్రభుత్వం చెప్పినట్లు సబ్జెక్టు టీచర్లు సరిపడా లేక చివరకు ప్రాథమిక పాఠశాలల నుంచి డిప్యూటేషన్పై హైస్కూళ్లకు తీసుకెళ్లి వారితోనే బోధన చేయిస్తున్నారు. దీంతో విలీనానికి అర్థం లేకుండా పోయింది. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయని చెప్పి 6-7 వేల మందికే పరిమితం చేశారు. కొందరు ప్రైమరీ టీచర్లు పదోన్నతుల కోసం ఎక్కడో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడక పదోన్నతులు సైతం వదులుకున్నారు. జిల్లాలో పాఠశాలల విలీనం ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది.
వేమూరు మండలంలో జంపని 8వ వార్డు పాఠశాల విద్యార్థులను స్థానిక ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ నాడు-నేడు పనుల కారణంగా ఉన్న గదులు చాలక వారిని తిరిగి పూర్వ పాఠశాలకు పంపారు. వేమూరులో జేబీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడ ఉన్న 40మంది విద్యార్థులను ఉర్దూ పాఠశాలలో కూర్చోబెడుతున్నారు. అంటే ఒకే పాఠశాల భవనం పైఅంతస్తులో ఉర్దూ పాఠశాల, కింద గదిలో జేబీ పాఠశాల నడుస్తుంది. ఇక్కడ ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదిలా ఉంటే జేబీ పాఠశాల విద్యార్థులు అంబేడ్కర్నగర్ నుంచి రైలు పట్టాలు దాటి ఇవతలి వైపునకు రావాలి.
వేమూరు ఉర్దూ పాఠశాలలో గదులు చాలక ఇదీ పరిస్థితి
కాలనీలో ఉన్న స్కూళ్లను కాదని..
ఉన్నత పాఠశాలకు 3 కి.మీ. లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని ఉన్నత పాఠశాలల్లో చేర్పించడంతో చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులతోనే నెట్టుకొస్తున్నారు. ఆ తరగతుల్లో పిల్లల సంఖ్య బాగా తక్కువగా ఉండటం అంత తక్కువ మంది పిల్లలకు ఒకరిద్దరు టీచర్లు ఉండటంతో కాలనీల్లో ఉన్న ప్రైమరీ పాఠశాలలు చాలా వరకు మూతపడుతున్నాయి. కొన్నిచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల పిల్లలకు చదువులు చెప్పించలేమని నాణ్యమైన చదువులు సాధ్యపడవని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని గతేడాది ప్రైవేటు బడులకు పంపారు. మరోవైపు ప్రభుత్వం గత రెండుసార్లు పాఠశాలల పునఃప్రారంభానికే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పిల్లలకు అమ్మఒడి వస్తోందని ప్రైవేటు పాఠశాలలు అమ్మఒడి సాయానికే తాము చదువు చెబుతామని మీ ఇంటికే బస్సులు పంపి పిల్లల్ని తీసుకెళతామని ఆకర్షించటం వంటివి చేయటంతో జిల్లా కేంద్రం బాపట్ల, రేపల్లె, చీరాల, కొల్లూరు, చెరుకుపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించారు.
వేమూరు అంబేడ్కర్నగర్ నుంచి బడికి వెళ్లేందుకు పట్టాలు దాటుతున్న విద్యార్థులు
విలీనంతో పేద పిల్లలకు కలిగిన ఇబ్బందులివీ
పిట్టలవానిపాలెం మండలం చందోలులో ఎంపీపీ పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల పిల్లల్ని దానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న నీలి బంగారయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయగా అంత దూరం పంపటానికి కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అసలే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. దీంతో చాలా మంది పిల్లల్ని చెరుకుపల్లి ప్రైవేటు కాన్వెంట్ల్లో చేర్పించి చదువులు చెప్పించుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు.
కొల్లూరు మండలం పోతార్లంక యూపీ పాఠశాల 6, 7 తరగతులకు చెందిన 20మంది పిల్లలను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దోనేపూడి ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అయితే వారు దోనేపూడి రావడానికి రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. దీంతో తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో భారం పెరిగింది.
ఇంటూరులో పంచాయతీ సమితి స్కూల్లో విలీనం తర్వాత ఒకే ఒక్క పిల్లోడు మిగలగా అతని కోసం స్కూల్ కొనసాగించలేక రికార్డుల్లో మాత్రం అక్కడే ఉన్నట్లు చూపి ఆ విద్యార్థిని సమీపంలో ఉన్న మరో పాఠశాలలో కూర్చొబెడుతున్నారు. అక్కడ ఉన్న టీచర్ను పెదపూడి పాఠశాలకు పంపారు.
వ్రేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో 8వ వార్డులో ప్రైమరీ స్కూల్ ఉంది. అక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల పిల్లల్ని దానికి 500 మీటర్ల దూరంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయగా 8వ వార్డుకు చెందిన పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారుల్ని ఎవరి సాయం లేకుండా అంతదూరం పంపలేమని గతేడాది ఆ స్కూల్ నుంచి 10 మంది పిల్లల్ని కొల్లూరులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఆ స్కూల్ ఈ పిల్లల్ని తీసుకెళ్లటానికి కాలనీకి నిత్యం బస్సు పంపుతోంది. అయితే విలీనం వల్ల ఉన్న ఊళ్లో స్కూల్ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు పంపినా వారొచ్చే వరకు బిక్కుబిక్కున గడుపుతున్నామని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
చీరాలకు సమీపంలోని వాడరేవులో ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల పక్క పక్కనే ఉన్నాయి. దీంతో ప్రైమరీ పాఠశాల్లో చదివే 3, 4, 5 తరగతుల పిల్లల్ని అక్కడే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయడంతో ఆ స్కూల్లో తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 600 మంది విద్యార్థులు ఉన్నారు. క్రీడల నిర్వహణకు క్రీడా ప్రాంగణం లేదు. మొత్తంగా ఇక్కడ ఇరుకిరుకు గదులతో పాఠశాల నిర్వహణ గందరగోళంగా మారింది.
అమృతలూరు మండలం తురిమెళ్ల ప్రాథమిక పాఠశాలను నాడు-నేడులో భాగంగా రూ.అర కోటికి పైగా వెచ్చించి బాగా అభివృద్ధి చేశారు. ప్రైమరీ పిల్లల్ని స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటంతో 1, 2 తరగతుల్లో కేవలం ఐదుగురు పిల్లలే మిగిలారు. దీంతో ఆ కాలనీలో స్కూల్ మూతపడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీ నుంచి 700-800 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు పంపలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు
[ 02-05-2024]
జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణింగవరం వద్ద కారు డివైడర్ను ఢీకొంది. -
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి