శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి
ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు.
పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు షంషుద్దీన్పై అనుచిత వ్యాఖ్యలు
ఆర్వోకి, ఎస్పీకి ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు
ఎస్పీ షోకాజ్ నోటీసు జారీ.. విధుల నుంచి తొలగింపు
ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి, తెదేపా నాయకులు
పర్చూరు (మార్టూరు), బాపట్ల, న్యూస్టుడే: ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంషుద్దీన్ను అసభ్య పదజాలంతో దూషించారు. ఇక్కడకు ఎందుకొచ్చావంటూ తొలుత షంషుద్దీన్ను ఎస్సై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వివాదానికి దారితీసింది. ప్రజలను బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారు.. రాజ్యాంగంలోని ప్రజల హక్కులను కాలరాస్తారా.. తెదేపా కార్యకర్తలను దూషిస్తూ.. వైకాపా శ్రేణులకు ఏజెంటుగా పని చేస్తున్నారా.. అంటూ ఎస్సై నాగశివారెడ్డిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆర్వో గంధం రవీందర్కి లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీసంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
విచారణకు ఎస్పీ ఆదేశం
తెదేపా నేతను అసభ్యంగా దూషించిన వ్యవహారంలో ఎస్సై నాగ శివారెడ్డిపై విచారణకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. విచారణాధికారిగా బాపట్ల డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణను నియమించారు. ఎస్సైను పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించి వివరణ కోరారు. షోకాజ్ నోటీసు జారీ చేసి ఆర్వో కార్యాలయం వద్ద బందోబస్తు విధుల నుంచి తప్పించి అన్నంభొట్లవారిపాలెం చెక్పోస్టు విధులకు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. బల్లికురవ ఎస్సైగా పని చేసిన సమయంలో నాగశివారెడ్డి స్టేషన్లో వైకాపా నాయకులతో సత్కారం అందుకోవడం, బల్లికురవలోని ఓ బడ్డీకొట్టులో మద్యం అమ్ముతున్నాడని ఓ వృద్ధుడ్ని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడం.. తదితర అంశాల నేపథ్యంలో అతడ్ని గతంలో జిల్లా ఎస్పీ వీఆర్కి పంపారు. ఈక్రమంలో పర్చూరు ఆర్వో కార్యాలయం వద్ద విధుల్లో ఉంటూ తెదేపా నాయకుడిపై అసభ్య పదజాలంతో దూషించడంతో ఎస్సై వ్యవహారశైలి మరోమారు వివాదాస్పదమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరాచక నేతలను ఓటుతో తరిమికొట్టండి
[ 06-05-2024]
‘ఇది మహనీయుల గడ్డ. ఎన్జీరంగా పుట్టిన ఈ నేలకు నమస్కరిస్తున్నా. చేనేత పితామహుడు ప్రగడకోటయ్య పుట్టిన ప్రదేశమిది. -
జనం ఆస్తులపై.. జగన్!
[ 06-05-2024]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు శాపంగా మారింది. -
పోస్టల్ బ్యాలట్ గందరగోళం
[ 06-05-2024]
జిల్లాలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆదివారం పీవో, ఏపీవోలకు ఉదయం శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడే పోస్టల్ బ్యాలట్ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించారు. -
మా ఆస్తులపై.. నీ పెత్తనం ఏంటీ జగన్!
[ 06-05-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చర్చ తీవ్రమవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
సీపీఎస్ రద్దని నమ్మించి ఉద్యోగులను మోసం చేసి..
[ 06-05-2024]
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ ఉద్యోగులతో ఊరూరా దండలు వేయించుకుని వారికి ముద్దులుపెట్టి తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పింఛను స్కీంను (ఓపీఎస్) తీసుకొస్తానని హామీ ఇచ్చారు. -
ఐదేళ్లూ.. దారిద్య్రమే!
[ 06-05-2024]
రహదారులు.. ప్రగతికి చిహ్నాలు. వైకాపా అయిదేళ్ల పాలనలో పూర్తిగా వీటిని నిర్లక్ష్యం చేశారు. అడుగుకో గుంత చొప్పున రోడ్డంతా చిల్లులు పడినా వైకాపా ప్రజాప్రతినిధులు, మంత్రులు పట్టనట్లు వదిలేశారు. -
8 వరకు పోస్టల్ బ్యాలట్కు అవకాశం
[ 06-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కలెక్టర్, ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి అన్నారు. -
అక్రమ వసూళ్లలో రజిని ఆల్టైం రికార్డు
[ 06-05-2024]
అయిదేళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైకాపా నేతలందరూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
పోలింగ్ బూత్ల వద్ద ఉద్యోగుల కష్టాలు
[ 06-05-2024]
తొలిరోజు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఉద్యోగులు అవస్థలు పడ్డారు. -
ఓటు హక్కు వినియోగం!
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మాటల్లోనే సురక్షితం.. గ్రామాలకు అందని జలం
[ 06-05-2024]
రొంపిచర్ల మండలంలోని మునమాకలో నాలుగేళ్ల నుంచి రక్షిత మంచి నీటి పథకం నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. -
తెదేపా కార్యకర్తలపై వైకాపా రాళ్ల దాడి
[ 06-05-2024]
మాచర్లలో వైకాపా మూక మరోసారి రెచ్చిపోయింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు దిగింది. -
బ్యాలెట్ ఓట్లకు బేరసారాలు
[ 06-05-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. పది ముఠాలు పోలింగ్ కేంద్రానికి సమీపంలో కాచుక్కున్నాయ్... ఓటేసేందుకు వచ్చిన ఉద్యోగితో బేరసారాలాడటం..
తాజా వార్తలు (Latest News)
-
డోన్ ఆర్థిక మంత్రి బుగ్గనకు నిరసన సెగ
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!