ఇంటింటా.. సౌర విద్యుత్తు ఉత్పత్తి
ఇంటింటిలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. తొలిసారిగా ప్రారంభించనున్న ఈ ప్రక్రియలో ఆర్థికభారం లేకుండా రాయితీలు, రుణాలు అందించి ప్రోత్సహించనున్నారు. గృహ అవసరాలకుపోనూ మిగులు కరెంట్ను ట్రాన్స్కోకు విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు.
స్త్రీనిధి ద్వారా ఏర్పాటుకు సన్నాహాలు
పద్దెనిమిది మండలాలకు 1000 యూనిట్లు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
ఇంటింటిలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. తొలిసారిగా ప్రారంభించనున్న ఈ ప్రక్రియలో ఆర్థికభారం లేకుండా రాయితీలు, రుణాలు అందించి ప్రోత్సహించనున్నారు. గృహ అవసరాలకుపోనూ మిగులు కరెంట్ను ట్రాన్స్కోకు విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు. జిల్లాలో కార్యాచరణపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్ల విద్యుత్తు వినియోగం పెరిగింది. పరిశ్రమలు, కర్మాగారాలు, వ్యాపార సముదాయాలు, గృహ అవసరాలకు కరెంట్ తప్పనిసరి. పెరిగిన వినియోగంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై నెలనెలా బిల్లు భారంగా పరిణమిస్తోంది. దీనిని అధిగమించేందుకు సంగారెడ్డి జిల్లాలోని రెడ్కో సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జిల్లాలో సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. పద్దెనిమిది మండలాల్లో తొలివిడతగా వెయ్యి చోట్ల కరెంట్ ఉత్పత్తి చేసేందుకు ఖరారు చేశారు. లబ్ధిదారుల ఇంటిపై పలకలను అమర్చనున్నారు. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ను గృహ అవసరాలకు వినియోగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అవసరాలకు సరిపోయాక మిగులును విద్యుత్ ఉపకేంద్రాలకు అందించి ఒక్కో యూనిట్కు రూ.4.50 చొప్పున ఆదాయం పొందే వీలుంటుంది. దీంతో లబ్ధిదారులు నెలనెలా ట్రాన్స్కోకు చెల్లించే బిల్లు నుంచి ఉపశమనం లభించనుంది. దీనికి తోడు అదనంగా నెలనెలా ఆదాయం పొందే ఆస్కారముంటుంది. ఇక అంతరాయానికి, కోతలకు అడ్డుకట్టపడనుంది.
మహిళా సంఘాలకు ప్రాధాన్యం
యూనిట్ల మంజూరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటిల్లో నమోదైన సభ్యులకు యూనిట్లను కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1.90 లక్షలు ఉండగా, ఇందులో రూ.60వేలు రాయితీ వర్తింపజేయనున్నారు. మిగిలిన రూ.1.30 లక్షలను స్త్రీనిధి ద్వారా రుణం మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి అరవై నెలల వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. సొంత ఇల్లు ఉన్న మహిళలకు యూనిట్లు అందించనున్నారు. అనంతరం మిగతా వారికి మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు.
27 నుంచి దరఖాస్తులు: యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 27వ తేదీ నుంచి మహిళా సమాఖ్య కార్యాలయాలు, సీసీలు, ఏపీఎంలకు దరఖాస్తులను సమర్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. డ్వాక్రా సభ్యురాలి ఫొటో, ఆధార్, బ్యాంకు ఖాతా నకలు ప్రతులను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. వీటిని పరిశీలించి సొంతిల్లున్న మహిళల ఇంటిపై రెడ్కో సంస్థ ద్వారా యూనిట్లను జులైలో ఏర్పాటు చేయిస్తామన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి: తుమ్మల వేణు, జిల్లా రీజినల్ మేనేజరు, స్త్రీనిధి
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకొని రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. కరెంటను ఉచితంగా పొందడంతోపాటు మిగిలిన దానిని ట్రాన్స్కోకు అందించడం ద్వారా నెలనెలా ఆదాయం పొందవచ్చు. సొంత ఇల్లు ఉన్న మహిళలు దరఖాస్తు సమర్పిస్తే సిబ్బంది వచ్చి సౌర పలకలు సామగ్రిని అమర్చుతారు.
జిల్లాలో ఇలా
స్వయం సహాయక సంఘాలు: 15,766
నమోదైన సభ్యులు:1,69,706
యూనిట్ల విలువ: రూ.19 కోట్లు
రాయితీ: రూ.6 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం