Hyderabad: హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నారన్న నిఘావర్గాల సమాచారంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41లక్షల నగదు, చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్లో పేలుళ్లకు కుట్రపన్నారన్న నిఘావర్గాల సమాచారంతో హైదరాబాద్ ముసారాంబాగ్లో నివాసముంటున్న అబ్దుల్ జాహెద్ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి ముసారాంబాగ్తో పాటు చంపాపేట్, సైదాబాద్, బాబానగర్, సంతోష్ నగర్లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్ఫోర్స్ పోలీసులు సాయంతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం జాహెద్తో పాటు సైదాబాద్ వాసి సమీరుద్దీన్, మెహదీపట్నం వాసి హసన్ ఫారూఖీని అరెస్టు చేశారు.
గతంలో బేగంపేట టాస్క్ఫోర్స్ కార్యాలయంలో పేలుడు సహా పలు ఘటనల్లో జాహెద్ పాల్గొన్నట్టు పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ-ఏఈటీతో తరచూ సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పరారీలో ఉన్న ఫర్హతుల్లా, అబ్దుల్ మాజిద్లు పాకిస్థాన్లో స్థిరపడినప్పటికీ హైదరాబాద్లో మరోసారి ఉగ్రదాడికి పథకం రచించారు. వారికున్న కాంటాక్ట్స్ ద్వారా జాహెద్తో సంప్రదింపులు జరిపారు. ఉగ్రదాడికోసం జాహెద్.. మాజ్ హసన్, సమీరుద్దీన్ను రిక్రూట్ చేసుకున్నాడని ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో సిట్ పోలీసులు దాడులు నిర్వహించారు. పాకిస్థాన్ ఉగ్రవాద హ్యాండర్ల నుంచి గ్రనేడ్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. గుంపులుగా ఉన్న ప్రజలపైకి గ్రనేడ్లు విసిరి దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ ఐఎస్ఐ తీవ్రవాదులతో మళ్లీ సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో జాహెద్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్ గ్రనేడ్లు, రూ.5.41లక్షల నగదు, చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. గ్రనేడ్లు విసిరి తద్వారా నగరంలో తీవ్ర భయాందోళనలు, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని కుట్రపన్నారని పోలీసులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నలుగురు అరెస్టు..
ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పీఎఫ్ఐపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలుగు రాష్ట్రాల్లో నలుగుర్ని అరెస్టు చేసింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్ఐపై నిజామాబాద్లో స్థానిక పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని ఎన్ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. గత ఆదివారం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, హార్డ్డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్కు చెందిన సయ్యద్ సమీర్, ఆదిలాబాద్కు చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!