నాటు అదిరింది.. నగరం ఊగింది!
నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాట రాసిన చంద్రబోస్ చదివిన రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థులు, ఆయనతో కలిసి చదవడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
అవార్డు ప్రకటనతో ఒక్కసారిగా ఆనందోత్సవాలు
ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయిన జనం
ఈనాడు, హైదరాబాద్
హబ్సిగూడ: నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాట రాసిన చంద్రబోస్ చదివిన రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థులు, ఆయనతో కలిసి చదవడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఈ కళాశాలలో చంద్రబోస్ ఎలక్ట్రికల్ విభాగంలో 1986-1989 బ్యాచ్ విద్యార్థి. ఆ రోజుల్లో ఎస్ఎఫ్ఐ కార్యకలాపాల్లో పాల్గొంటూ పాటలు పాడేవాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సినిమా పాటలు వినసొంపుగా ఆలపించే వాడు’ అని స్నేహితులు వివరించారు.
మిన్నంటిన ‘ఆస్కార్’ సంబరాలు
తెలతెలవారుతుండగానే భాగ్యనగరం ‘నాటు..నాటు’ అంటూ ఊగిపోయింది. తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ‘ఆస్కార్’ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు దక్కడంతో చిన్నా పెద్దా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. లాస్ఏంజిల్స్ వేదికగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతున్న వైనాన్ని ఇక్కడి నుంచే లైవ్ ద్వారా వీక్షిస్తూ.. మన సినిమా వంతు ఎప్పుడొస్తుందా అని ఉత్సుకతతో ఎంతోమంది సోమవారం తెల్లవారుజాము నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఉత్కంఠగా వీక్షించారు. ఒక్కో కేటగిరిలో అవార్డులను ప్రకటిస్తుండగా అందరి ముఖాల్లో ఒక్కటే ఉత్కంఠ. ఆ భాగ్యం మనకు దక్కుతుందా..లేదా అని నిశ్శబ్దంగా ఉండిపోయారు. తప్పకుండా అవార్డు వస్తుందనే నమ్మకం ఉన్నప్పటికీ మిగతా అంతర్జాతీయ సినిమాలు కూడా పోటీలో ఉండటం వల్ల ఎక్కడో చిన్న సంశయం. క్షణాలు గడుస్తుండగా..ఇంతలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరి కేరింతల నడుమ ప్రకటించారు. అవార్డు గోస్ టు ‘నాటు నాటు’ అనగానే లాస్ ఏంజిల్స్లో డాల్బీ థియేటర్ కరతాళ ధ్వనులతో దద్దరిల్లగా.. భాగ్యనగరం కూడా ఆనందంతో ఊగిపోయింది. కేరింతలు కొడుతూ.. విజిల్స్ వేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. తమ ఇంటికే అవార్డు వచ్చినంత సంతోషం వ్యక్తం చేశారు. టీవీల ముందు నాట్యం చేసి తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. ఫేస్బుక్, ట్విటర్.. ఏ సామాజిక మాధ్యమం చూసినా..నాటు నాటు పాట...ఆస్కార్ అవార్డుపైనే విశ్లేషణలు రాస్తూ.. తమ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు కన్పించాయి.
మన సినిమా ఖ్యాతి పెరిగింది
కరుణాకర్రెడ్డి
అమీర్పేట:‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం దక్కడంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వడ్డె కరుణాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బీకేగూడలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి అభినందనలు తెలిపారు. గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకులు కీరవాణి, దర్శకులు రాజమౌళి తెలుగు పాటతో పాటు దేశప్రతిష్ఠనూ పెంచారన్నారు.
ఆస్కార్ విజేత చంద్రబోస్ రామంతాపూర్ విద్యార్థి
చంద్రబోస్తో కలిసి చదువుకున్నందుకు ఆనందంగా ఉందని బాల్యమిత్రుడు శ్రీనివాస్ అన్నారు. మేమంతా హాస్టల్లో కలిసి ఉండేవాళ్లం. తాను ఎలక్ట్రికల్, నేను సివిల్ బ్యాచ్. తన పాట నేడు ప్రపంచ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయం.
బస్తీ కుర్రాడి పాట.. విశ్వమంతటా..
ఈనాడు, హైదరాబాద్: నాటునాటు పాటతో రాహుల్ సిప్లిగంజ్ పేరు.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. భాగ్యనగర గల్లీల్లో గణపతి ఉత్సవాల్లో పాటలు పాడే ఓ కుర్రాడు.. విశ్వవేదికపై తన గొంతును వినిపించి.. చార్సౌ నగరి ఖ్యాతిని చాటాడు. ఆస్కార్ వేదికపై ప్రత్యక్షంగా పాట పాడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించడంతో రాహుల్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. పెద్ద ఎత్తున అభిమానులు ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..తొలుత గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకున్న క్రమంలోనే ఆస్కార్ అవార్డుపై తమకు నమ్మకం కలిగిందని.. అదే నిజమైందని పలువురు పేర్కొన్నారు.
ఆస్కార్ వరించడంతో వారాసిగూడలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తున్న చిన్నారులు
తెలుగుజాతికే గర్వకారణం
తుమ్మల భూమికాచౌదరి, నిజాంపేట
‘నాటు.. నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం. మన తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడం విశేషం. యువత మదిలో అగ్రతారలుగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, రామ్చరణ్ అభిమానులకు నిజంగా పండగే. అదేవిధంగా పాట రచయిత చంద్రబోస్తోపాటు శ్రోతల మనసులను ఉర్రూతలూగించేలా పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు తెలుగు ఖ్యాతిని చాటారు. ఇంతటి ఉన్నతమైన అవార్డు మన సొంతం కావడంతో ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతోంది.
సువర్ణాక్షరాలతో లిఖించే రోజు
తూము శ్రావ్య, మూసాపేట
తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం సినీచరిత్రలోనే మహోన్నతమైన ఘట్టం. ఇది కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. తెలుగువాడితో పాటు యావత్ దేశ ప్రజలకు గర్వకారణం. తెలుగు వాడి సత్తా ప్రపంచ స్థాయిలో ఎలుగెత్తి చాటిన ‘నాటు’ పాట సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.
న్యూస్టుడే, మూసాపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
చైతన్యపురి మోహన్నగర్ వద్ద ఓయో హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!