ఫలితాల్లో.. ‘పది’ పోయింది
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి.
చివరి నుంచి నాలుగో స్థానంలో రాజధాని
రంగారెడ్డి 24.. 27వ స్థానంలో మేడ్చల్
ఈనాడు, హైదరాబాద్
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్ జిల్లాలు నిలబడ్డాయి. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో హైదరాబాద్ 30వ స్థానం దక్కించుకోగా.. మేడ్చల్ జిల్లా 27వ స్థానం, రంగారెడ్డి జిల్లా 24వ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ మూడు జిల్లాలు 28, 20, 14 స్థానాల్లో నిలిచాయి. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకకుండా పోయింది. మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మంచి ఉత్తీర్ణత సాధించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ‘రామోజీ ఫౌండేషన్’ సహకారంతో కొనసాగుతున్న నాగన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. 96శాతం మంది ఉత్తమ గ్రేడ్లను దక్కించుకున్నారు.
ఉత్తీర్ణత పెరిగినా..
మూడు జిల్లాల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులైనా.. ఇతర జిల్లాలతో పోలిస్తే ర్యాంకులు తగ్గాయి. మొత్తం 1.70లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 1.51లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 7445 మంది పరీక్షలు రాస్తే...5873మంది మాత్రమే పాసయ్యారు. గోల్కొండ జోన్లో 357 మంది, ఆసిఫ్నగర్ మండలంలో 276 మంది, తిరుమలగిరి మండలంలో 110 మంది పరీక్షల్లో తప్పారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 80శాతం మించలేదు.
కారణాలు ఇవేనా..?
- ఉపాధ్యాయుల బదిలీలు.
- తేడాది ఎన్నికల విధులకు వెళ్లడం.
- జీవో నంబర్ 317 కింద జరిగిన బదిలీలు వివాదాస్పదం కావడం.
- ఉపాధ్యాయులు, విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు రాకపోవడం.
- సర్కారు బడుల్లో సదుపాయాల కొరత.
- కొన్ని పాఠశాలల్లో చాలీచాలని గదులు.
- మరికొన్ని బడుల్లో ఇంటర్ కళాశాలలు కొనసాగుతుండడం.. ఇలా వివిధ అంశాలు పదోతరగతి ఫలితాలపై ప్రభావం చూపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుభవజ్ఞులకు చోటు
[ 22-05-2024]
రాజధానిలోని 5 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జులుగా అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారులు ఎం.దానకిషోర్, బుర్రా వెంకటేశం, డాక్టర్ శైలజా రామయ్యర్, ఎస్.ఎ.ఎం.రిజ్వీ, జయేష్ రంజన్ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నియమించింది. -
ఇళ్ల దరఖాస్తుల తిరస్కరణపై గ్రేటర్ కమిషనర్ ఆగ్రహం
[ 22-05-2024]
నిర్మాణ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తూ.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ టౌన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిర్లక్ష్యం.. తప్పదు మూల్యం
[ 22-05-2024]
శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడినట్లే. ఒకసారి హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా రూ.135 (సర్ఛార్జీలతో కలిపి). -
డీఈవోకు తాఖీదులు
[ 22-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల పురోగతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న విద్యాశాఖాధికారులపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
[ 22-05-2024]
కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. భార్య గొంతుపై కాలుతో తొక్కి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బ్యాంకుకాలనీలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎలక్షన్రెడ్డి కథనం ప్రకారం.. -
గాబరా పెడుతూ.. నాసివి అంటగడుతూ..
[ 22-05-2024]
తొలకరి ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడే కొందరు విత్తన వ్యాపారులు అన్నదాతలను పరుగులు పెట్టిస్తున్నారు. పత్తి విత్తనాల కోసం రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని కృత్రిమ కొరతకు తెర తీస్తున్నారు. -
కంకర దారిలో.. కష్టాల ప్రయాణం
[ 22-05-2024]
గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరై సంవత్సరాలు దాటినా పనులు పూర్తి చేయించలేని దుస్థితి నెలకొంది. దెబ్బతిన్న తారు రహదారుల నిర్మాణానికి కంకర పరిచారు. ఏళ్లు గడిచినా.. -
ఆగని పారిశ్రామిక ప్రమాదాలు
[ 22-05-2024]
పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడంలేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం తాండూరు మండలం గుంతబాస్పల్లి శివారులోని రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
పూడూరులో ఎన్ఐఏ సోదాల కలకలం
[ 22-05-2024]
వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో మంగళవారం జాతీయ పరిశోధన సంస్థ(ఎన్ఐఏ) సోదాలు జరిపి ఓ యువకుణ్ని అదుపులోకి తీసుకోవడం జిల్లాలో కలకలం రేపింది. -
సైబర్ మోసం..యువకుల అప్రమత్తం
[ 22-05-2024]
బషీరాబాద్ మండలం వాల్యానాయక్ తండాకు చెందిన సిద్దునాయక్, అదే తండాకు చెందిన మరో యువకుడు ఇటుకల వ్యాపారం చేస్తారు. మంతట్టి రైల్వే స్టేషన్ పనుల గుత్తేదారు కింద పనిచేసే సహాయకుడు ఇటీవల ట్రాక్టర్ ఇటుకలు కావాలని కోరగా రూ.23,500కు మాట్లాడుకున్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థులతో ఈడబ్ల్యూబీజీ ప్రొఫెసర్ భేటీ
[ 22-05-2024]
యూరోపియన్ వెల్నెస్ బయోమెడికల్ గ్రూప్(ఈడబ్ల్యూబీజీ) ప్రొఫెసర్ డా.మైక్చాన్ మంగళవారం గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. స్టెమ్ సెల్ థెరపీ విధానంలో వచ్చిన మార్పులు, జరుగుతున్న పరిశోధనలపై వారితో చర్చించారు. -
నైజీరియా నుంచే ఫోన్
[ 22-05-2024]
రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు నైజీరియాలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఇదే నంబర్తో ఇంకా ఎవరికైనా ఫోన్లు వెళ్లాయా అన్నదానిపైనా అధికారులు దృష్టి సారించారు. -
రవీంద్రభారతిలో 20కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం
[ 22-05-2024]
సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీనిని కనుగొన్నారు. -
నల్సార్లో సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా ఏర్పాటుకు ఎంఓయూ
[ 22-05-2024]
నల్సార్ యూనివర్సిటీలో మిలన్ కె.బెనర్జీ ‘సెంటర్ ఫర్ ఆర్బిట్రేషన్ లా’ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది గౌరవ్ బెనర్జీ వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.కృష్ణదేవరావుతో దిల్లీలో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. -
మాజీ ఉద్యోగుల సొమ్ము స్వాహా
[ 22-05-2024]
అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తూ ఆ సంస్థకు చెందిన రూ.3.2 కోట్లను స్వాహా చేసిన వ్యక్తిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. -
‘లక్ష్య’ అథ్లెట్లకు పుల్లెల గోపీచంద్ అభినందనలు
[ 22-05-2024]
ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన బ్యాట్(బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. -
ఉపాధ్యాయుల నియామకంలో నైపుణ్యం ముఖ్యం
[ 22-05-2024]
ప్రైవేటు పాఠశాలల్లో బోధనా సిబ్బంది నియామకంలో ప్రధానంగా చూడాల్సింది వారి అకడమిక్ అర్హతలు కాదని.. వివిధ అంశాల్లో వారికున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) -
ద్విచక్ర వాహనం నుంచి పడి గృహిణి మృతి
[ 22-05-2024]
స్పీడ్బ్రేకర్ వద్ద భర్త ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సెక్రటేరియట్ పోలీసుస్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. బేగంపేట్ రసూల్పురాలో నివాసం ఉంటున్న ఫాతిమా (30), ఫయాజ్లు భార్యాభర్తలు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..