నీటి నిల్వ కేంద్రాల్లో ఇష్టారాజ్యం
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటిని సరఫరా చేసే సురక్షిత నీటి కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాత్రింబవళ్లు నీటిని శుద్ధి చేసి పంపిస్తుండగా..
న్యూస్టుడే-కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటిని సరఫరా చేసే సురక్షిత నీటి కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిరంతరంగా పర్యవేక్షణ చేయాల్సిన సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాత్రింబవళ్లు నీటిని శుద్ధి చేసి పంపిస్తుండగా..ఆ శుద్ధినీరు వృథా చేయకుండా రిజర్వాయర్లు సకాలంలో నింపుకోవాల్సి ఉంటుంది. నీరు నిండిన తర్వాత పంపులు నిలిపి వేయాల్సి ఉండగా చూడకపోవడంతో మురుగుకాల్వల్లోకి ప్రవహిస్తోంది. పంపు ఆపరేటర్లు, లైన్మెన్లు, ఫిట్టర్లు, లీకేజీ కార్మికులు ఎవరికి వారే అన్నట్లుగా ఉండటం, ట్యాంకులు అప్పగించిన ఏఈలు కూడా కనిపించకుండా పోతుండటంతో నీటి విభాగం గాడి తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రక్షణ లేక అవస్థలు
తాగునీటి రిజర్వాయర్లు, నీటిశుద్ధి కేంద్రాలు నిషేధిత ప్రాంతాలు. ఆవరణలోకి ఇతరులకు ప్రవేశం ఉండదు.. నగరంలో నిబంధనలు అమలు కావడం లేదు. సిబ్బంది కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు. కొన్ని రిజర్వాయర్ల దగ్గర అయితే బయట వ్యక్తులు వచ్చి అడ్డాలు పెట్టడం, అందులోనే పంచాయతీలు పెడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. రాత్రి వేళలో అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కట్టడి చేయకపోవడంతో ఇతరులు నేరుగా లోపలికి వస్తున్నారు. ఇదిలా ఉండగా రెండు ప్రధాన రిజర్వాయర్లలో పని చేస్తున్న కొందరు కార్మికులు మద్యం మత్తులోనే విధులకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు మందలిస్తే కార్పొరేటర్ల దగ్గరికి పరుగులు పెట్టి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దాంతో అధికారులు సైతం పట్టనట్లు ఉంటున్నట్లు సమాచారం.
అడ్డగోలుగా నీటి తరలింపు
ప్రజావసరాలకు బల్దియా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుండగా, ఇందులోనే ప్రైవేటు ట్యాంకర్లు కలిసిపోయి అడ్డగోలుగా నీటిని తరలిస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కలకు క్లోరినేషన్ వాడకూడదని తెలిసినా నగరపాలికతో పాటు ఇతర ట్యాంకర్లు కూడా ఈ నీటినే చెట్లకు పోయడానికి తీసుకెళ్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ ఏ ఒక్కటీ కూడా ఉచితంగా నీటిని నింపుకొని తీసుకెళ్లడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో దర్జాగా ట్యాంకర్ల నీటిని ఉచితంగా తీసుకెళ్తున్నట్లు అక్కడికీ వచ్చే ట్యాంకర్లను పరిశీలిస్తేనే తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో అధికారి ఉన్నా..లేనట్లేనా?
నగరంలోని 16 రిజర్వాయర్లతో పాటు విలీన కాలనీల్లో ఉన్న రిజర్వాయర్లకు క్షేత్రస్థాయి అధికారి పర్యవేక్షణకు నియమించారు. కొందరికి రెండు, మూడు ట్యాంకులకు ఒక్కరిని నియమించారు. వీరంతా ప్రతిరోజు షిఫ్టుల వారీగా తనిఖీ చేయాల్సి ఉండగా కొందరైతే కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు లేకపోలేదు. ఆయా ట్యాంకుల వారీగా లీకేజీల పరిశీలన, తాగునీటి సరఫరా సమయసారిణి, కొత్త నల్లా కనెక్షన్లు, చేతిపంపుల మరమ్మతులు, విడిభాగాల భద్రత, తొలగించిన పాత వస్తువుల రికవరీ వంటివి ఎప్పటికప్పుడూ చూసుకోవాల్సి ఉంటుంది. కొందరు తప్ప మిగతా వారు ట్యాంకుల ఇన్ఛార్జులు ఉన్నా లేనట్లేనని స్వయంగా సిబ్బందే చెప్పడం గమనార్హం.
తనిఖీలు చేసేలా ఆదేశాలు - పి.వి.రామన్, ఈఈ, నగరపాలిక
నీటి ట్యాంకులు, ఫిల్టర్బెడ్ను నిరంతరం తనిఖీలు చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. అర్ధరాత్రి కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు సభలతో కాంగ్రెస్ జోరు
[ 04-05-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు. -
శాసన సమరం.. దిల్లీలో గళం
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు. -
కేసీఆర్ రోడ్ షోతో భారాసలో హుషారు
[ 04-05-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నేను ఈవీఎం.. 13న కలుద్దాం
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అనారోగ్యంతో ఆబ్కారీ ఎస్సై మృతి
[ 04-05-2024]
ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. -
మావోయిస్టు నేతకు అంతిమ వీడ్కోలు
[ 04-05-2024]
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. -
బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
[ 04-05-2024]
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘చక్కెర పరిశ్రమపై కాంగ్రెస్ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘పని చేయని నాయకులను నిలదీయాలి’
[ 04-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, పిప్రి, చేపూర్ గ్రామాల్లో, మాక్లూర్ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. -
పంట రుణాలపై వడ్డీ వసూలు
[ 04-05-2024]
జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది. -
క్యూఆర్ కోడ్తో ఓపీ నమోదు
[ 04-05-2024]
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్కోడ్ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందుసింగ్ అన్నారు. -
ఆ రెండు పార్టీలకు ఓటేసి మోసపోవద్దు
[ 04-05-2024]
ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం అసాధ్యం
[ 04-05-2024]
లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. -
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?
[ 04-05-2024]
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపులో ఆదర్శం
[ 04-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 04-05-2024]
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా లేరు. -
ఈసీ మార్గదర్శకాలపై అవగాహన అవసరం
[ 04-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.