అమ్యామ్యాల పర్వం.. వాటాలే సర్వం
లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.
రూ.17 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఈఈ
ఈనాడు డిజిటల్, కరీంనగర్ న్యూస్టుడే- కార్పొరేషన్, నేరవార్తలు
పట్టుబడిన ఈఈ రామన్ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు
లంచావతారుల బాగోతాల్ని బట్టబయలు చేసేలా అనిశా దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. ఏదో ఒక విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పట్టుబడుతున్నా.. భయపడకుండా బరితెగిస్తున్నారు. తాజాగా కరీంనగర్ బల్దియాను కుదిపేసేలా ఈఈ స్థాయి అధికారి రూ.17వేలు తీసుకుంటూ దొరికిపోవడం కలకలం సృష్టించింది. ఇక్కడి కార్యాలయంలో ఏడేళ్ల కిందట రెవెన్యూ ఇన్స్పెక్టర్ పట్టుబడగా.. మళ్లీ కీలకమైన హోదాలో ఉన్న అధికారి అనిశాకు దొరకడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ప్రతి పనికి ఓ రేటు..!
ఎవరు కాదన్నా.. అవునన్నా..! జిల్లాలోని ఇంజినీరింగ్ పనుల్లో కచ్చితంగా ప్రతి పనికి ఇంత రేటు ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే.! ముఖ్యంగా అభివృద్ధి పనులను చేపట్టే గుత్తేదారులు రాజకీయ నాయకులతోపాటు పనుల్ని పర్యవేక్షించే యంత్రాంగానికి ఆయా స్థాయిని బట్టి ఎంతోకొంత ముట్టచెప్పనిదే దస్త్రం కదలదనేది జగమెరిగిన సత్యం. ఇదే కోవలో ఏఈ స్థాయి నుంచి ఎస్ఈ స్థాయి వరకు ఈ కమీషన్ల గోల నడుస్తూనే ఉంది. 1 నుంచి 3శాతం వరకు ఈ చెల్లింపులు ఉంటున్నట్లు తెలిసింది. చాలా సందర్భాల్లో పనులు చేసే గుత్తేదారుకు, వీటిని గమనిస్తున్న అధికారికి మధ్య సయోధ్య కారణంగా వీరి మధ్య జరిగే ఇచ్చిపుచ్చుకోవడాలు బయటపడవు. చాలా తక్కువ సందర్భాల్లోనే వీరు బయటపడుతుంటారు. పైగా కొందరు అధికారుల వ్యవహారం శ్రుతిమించినట్లు ఉండటంతోపాటు ప్రతిపనిలో ఇబ్బందులు పెడుతున్న సమయంలోనే బాధితులు అనిశా అధికారుల్ని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా లక్షలు వెచ్చించి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయించే క్రమంలో విపరీత జాప్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. చేసిన ఖర్చులు చేతికి రాక బాధితులు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సంఘటనలు ఇదివరకు జిల్లాలో కనిపించాయి. కొన్ని నెలల కిందట హుజూరాబాద్ నియోజకవర్గంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా ఓ అధికారి సతాయిస్తున్నాడని గుత్తేదారు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.!
బాధితుడి నుంచి వివరాలు తీసుకుంటున్న అనిశా సిబ్బంది
ఈ ఏడాదిలో తొలికేసు..
లంచంగా తీసుకున్న నగదుతో ఈఈ రామన్
లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఈఈ పట్టుబడిన సంఘటన మంగళవారం కరీంనగర్లో జరిగింది. అనిశా డీఎస్సీ భద్రయ్య తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న పీవీ రామన్ గుత్తేదారు మధుకర్ నుంచి రూ.17వేలు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీలో నిర్మించిన పార్క్, 17,18 డివిజన్లలో హరితహారం కింద తీసిన గుంతలకు సంబంధించిన బిల్లు, పూడిక తీసిన పనులకు రూ.17,20,546 వరకు బిల్లులు రావడంలో ఆలస్యమైందని.. సంబంధిత దస్త్రాలు ముందుకు కదిలించాలంటే తనకు మొత్తం పనుల్లో ఒక్క శాతం కమీషన్ ఇవ్వాలని ఈఈ డిమాండ్ చేశారని తెలిపారు. ఈఈతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్యాలయం ఆవరణలో డబ్బుల్ని ఇస్తుండగా అనిశా పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని ఓ పార్క్ అభివృద్ధితోపాటు హరితహారం గుంతలు, మురుగు కాలువలో పూడికతీతకు సంబంధించిన బిల్లులు గుత్తేదారుకు ఇప్పించడంతో జాప్యం వల్లనే బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు.మరోవైపు పట్టుబడిన ఈఈ నివాసముంటున్న జగిత్యాల, హైదరాబాద్, కరీంనగర్లోనూ అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు.
* కొత్త సంవత్సరంలో పట్టుబడిన కేసులలో కార్పొరేషన్ది మొదటిది. గతేడాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గతేడాది నవంబరు 30వ తేదీన రామగుండం నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్కుమార్ కూడా ఇదే తరహాలో లక్ష రూపాయల్ని తీసుకుంటూ పట్టుబడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.