బీసీలకు బాసట.. ఎందరికి ఊరట?
బీసీలకు వ్యక్తిగత రుణాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న యువత ఉన్నపళంగా అర్జీలు పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
రుణాలపై చిగురిస్తున్న ఆశలు
ఉమ్మడి జిల్లాలో ఆశావహులు అధికమే
ఈనాడు, కరీంనగర్: బీసీలకు వ్యక్తిగత రుణాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న యువత ఉన్నపళంగా అర్జీలు పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధికి బాటలు వేసేందుకు రుణాలివ్వాలని తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల సంఖ్య నాలుగు జిల్లాల పరిధిలో పెరగబోతోంది. ఈ నెల 20వ తేదీ వరకు గడువుని నిర్ణయించడంతో చిరు వ్యాపారులతోపాటు కొత్తగా ఉపాధిని అందుకోవాలనుకునేవారు ఆన్లైన్ కేంద్రాలకు, రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ సహా ఇతర పత్రాలను సమకూర్చుకుంటున్నారు. ఆన్లైన్లో స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవడంతో ముందుగానే తమ వివరాల్ని నమోదు చేయించుకోవాలని చూస్తున్నారు.
అర్హులకు అందేనా?
గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా మూడు కేటగిరీలుగా అందించిన రుణసాయం విషయంలో ఉమ్మడి జిల్లాలో పైరవీలకే ప్రాధాన్యతనిచ్చారనే ఆరోపణలు వినిపించాయి. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి తుది జాబితాలో ఎక్కువగా నాయకులు వారి అనుచరగణానికి చోటిచ్చారనే విమర్శలున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరవాత కొన్నేళ్లపాటు ఇచ్చిన ఈ సాయం తరువాత నిలిపివేశారు. దాదాపుగా ఏడేళ్ల తరవాత మళ్లీ తెరమీదకు రుణాల ప్రస్తావన రావడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పైగా గతానికి భిన్నంగా ఈ సారి లక్ష రూపాయల రుణం వందశాతం రాయితీతో అందిస్తుండటంతో ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలనే ఉద్దేశంతో అందరూ చొరవ చూపిస్తున్నారు. అప్పట్లో కేటగిరీ-1 కింద రూ.75 వేల నుంచి రూ.లక్ష, కేటగిరీ-2 కింద రూ.2 లక్షల వరకు, కేటగిరీ-3 కింద రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు రాయితీ రుణం అందేది. ఈ సారి తక్కువ మొత్తంతో ఎక్కువ మంది బీసీ లబ్ధిదారులకు చేయూతనివ్వాలని సర్కారు భావిస్తోంది.
పెరగనున్న పోటీ!
ఈసారి అర్హుల ఎంపిక విషయంలో విపరీతమైన పోటీ ఉండనుంది. దీంతో కొందరు ఎందుకైనా మంచిదని ముందుగానే ఓ మాట తమకు తెలిసిన నాయకులకు చెబుతూనే అర్జీ పెట్టుకుంటున్నారు. 2015లో ఉమ్మడి జిల్లాకు బీసీ కార్పొరేషన్ ద్వారా 2,306 యూనిట్లు మంజూరవగా అప్పుడున్న నిబంధనల ప్రకారం వెల్లువలా దరఖాస్తులు అందాయి. ఏడేళ్ల కిందటే 20,926 మంది పోటీపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంఖ్య దాదాపుగా అయిదింతలకు పెరిగే అవకాశముంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికి రుణాలను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనే ఎంపిక ప్రక్రియను చేపట్టారు. అప్పుడు ఉమ్మడి జిల్లాకు అవకాశం లభించలేదు. నాలుగు జిల్లాల పరిధిలో మాత్రం ప్రతి వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్, సంక్షేమశాఖల తరఫున రుణాలను అందించేందుకు ప్రణాళికల్ని రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉంటున్నా.. క్షేత్రస్థాయికి యూనిట్ల మంజూరు ప్రస్తావన ఇన్నాళ్లు వినిపించలేదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆశతో ప్రతి ఏడాది బీసీలంతా రుణాల కోసం నిరీక్షిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈసారి తీసుకున్న నిర్ణయంతో తక్కువ రుణమైనా.. ఎక్కువ రాయితీతో అందుతుందనే ఉత్సాహంతో ఆ దిశగా ఆశావహ యువత అడుగులేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు సభలతో కాంగ్రెస్ జోరు
[ 04-05-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు. -
శాసన సమరం.. దిల్లీలో గళం
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు. -
కేసీఆర్ రోడ్ షోతో భారాసలో హుషారు
[ 04-05-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నేను ఈవీఎం.. 13న కలుద్దాం
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అనారోగ్యంతో ఆబ్కారీ ఎస్సై మృతి
[ 04-05-2024]
ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. -
మావోయిస్టు నేతకు అంతిమ వీడ్కోలు
[ 04-05-2024]
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. -
బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
[ 04-05-2024]
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘చక్కెర పరిశ్రమపై కాంగ్రెస్ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘పని చేయని నాయకులను నిలదీయాలి’
[ 04-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, పిప్రి, చేపూర్ గ్రామాల్లో, మాక్లూర్ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. -
పంట రుణాలపై వడ్డీ వసూలు
[ 04-05-2024]
జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది. -
క్యూఆర్ కోడ్తో ఓపీ నమోదు
[ 04-05-2024]
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్కోడ్ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందుసింగ్ అన్నారు. -
ఆ రెండు పార్టీలకు ఓటేసి మోసపోవద్దు
[ 04-05-2024]
ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం అసాధ్యం
[ 04-05-2024]
లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. -
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?
[ 04-05-2024]
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపులో ఆదర్శం
[ 04-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 04-05-2024]
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా లేరు. -
ఈసీ మార్గదర్శకాలపై అవగాహన అవసరం
[ 04-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం