13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు
పదమూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 15 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా వీటికి అదనంగా ఆరు సార్లు పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: పదమూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 15 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా వీటికి అదనంగా ఆరు సార్లు పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 2010లో అప్పటి తెరాస అధినేత నిర్ణయం మేరకు అయిదు శాసనసభ స్థానాలకు అయిదుగురు శాసనసభ్యులు రాజీనామా చేసి తిరిగి విజయ బావుటా ఎగురవేశారు. మిగిలిన ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. జగిత్యాలలో రెండు సార్లు, పెద్దపల్లి, మెట్పల్లి, బుగ్గారం అప్పటి నియోజకవర్గాలలో ఒకసారి, హుజూరాబాద్, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి ఇప్పటి నియోజకవర్గాలకు ఒకసారి ఉప ఎన్నికలు జరిగాయి.
హుజూరాబాద్
- 2009 శాసనసభ సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్, వేములవాడ, ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాలలో తెరాస పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. 2010లో తెరాస అధినేత ఆదేశాల మేరకు వీరు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్లీ విజయం సాధించారు. హుజురాబాద్ నుంచి ఎన్నికైన ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి దివంగత ముద్దసాని దామోదర్రెడ్డిపై గెలుపొందారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కె.తారకరామారావుకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కె.కె.మహేందర్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్పై విజయం సాధించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు సైతం అప్పటి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జె.రత్నాకర్రావును ఓడించారు. ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై గెలుపొందారు. ఈ అయిదుగురు ప్రత్యర్థులను ఖంగుతినిపించారు. వీరంతా 2014వరకు పదవులలో ఉన్నారు.
కోరుట్ల
- 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అప్పటి భాజపా సీనియర్ నేత ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్రావు కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్రావు మెట్పల్లి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. 1998లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ కొమిరెడ్డి జ్యోతి, భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. 1999 ఎన్నికల వరకు జ్యోతి ఎమ్మెల్యేగా పని చేశారు.
- 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానానికి జగిత్యాల ఎమ్మెల్యేగా ఎల్.రమణ తెదేపా నుంచి గెలిచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా ఆ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బండారి వేణుగోపాల్పై కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి విజయం సాధించారు.
పెద్దపల్లి
- మాజీ ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎన్టి.రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం 1983లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సంజయ్ విచార్ మంచ్తో కలిసి పోటీ చేసింది. పెద్దపల్లి శాసనసభ స్థానానికి సంజయ్ విచార్ మంచ్కు కేటాయించారు. ఆ పార్టీ నుంచి గోనే ప్రకాశ్రావు విజయం సాధించారు. ఆ తర్వాత ప్రకాశ్రావు కొన్ని కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆక్రమంలో ఆ నియోజకవర్గానికి 1983లోనే ఉప ఎన్నికలు జరగగా అప్పటి తెదేపా అభ్యర్థి వేముల రమణయ్యపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి 1985వరకు ప్రాతినిథ్యం వహించారు.
- 1963లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ఎం.ధర్మరావు విజయం సాధించారు. కొన్ని కారణాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కె.లక్ష్మినరసింహారావు విజయం సాధించారు.
జగిత్యాల
- 1957 శాసనసభ ఎన్నికలలో మోహన్రెడ్డి బుగ్గారం శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి 1958 వరకు కొనసాగారు. ఏడాది తర్వాత ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటి చేసిన బి.ఎల్లారెడ్డి గెలిచి 1962 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!