విద్యార్థి సంఘం నేతకు దక్కిన అవకాశం
ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఒకరిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేయడం ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ టికెట్ ఖరారుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
న్యూస్టుడే, హుజూరాబాద్: ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఒకరిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేయడం ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. 2021 అక్టోబరులో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను బరిలోకి దింపగా ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రయత్నించినప్పటికి కాంగ్రెస్ అధిష్ఠానం వొడితెల ప్రణవ్కు టికెట్ ఇచ్చింది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన వెంకట్కు సరైన న్యాయం చేస్తానని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్ట మొదటిసారిగా రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులలో వెంకట్కు చోటు దక్కింది. 2021లో హుజూరాబాద్కు చెందిన పాడి కౌశిక్రెడ్డికి భారాస అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వగా విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో తిరిగి హుజూరాబాద్లో పోటీ చేసిన నేతకే కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇవ్వడం గమనార్హం. తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన అధిష్ఠానానికి వెంకట్ కృతజ్ఞతలు తెలిపారు.
పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు
పుట్టిన తేదీ : 2.11.1992, విద్యార్హత : ఎంబీబీఎస్
తల్లిదండ్రులు : పద్మారావు, మదన్మోహన్రావు భార్య : రమ్య,
స్వగ్రామం : జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల
పార్టీ హోదా : ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
రాజకీయ నేపథ్యం : 2015, 2018లలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా పని చేశారు.
బల్మూరి వెంకట్ స్వగ్రామం మానాల మండలం మానాల అయినా వారి కుటుంబం చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్కు వెళ్లి స్థిరపడింది. తండ్రి మదన్మోహన్రావు 15 ఏళ్ల కిందట చనిపోయారు. కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వెంకట్ 2018లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికి రాలేదు. 2021 అక్టోబరులో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వెంకట్ను బరిలో దింపినప్పటికి ఆయన ఓటమి పాలయ్యారు.
ఆందోళనల్లో చురుగ్గా.. : హైదరాబాద్లో ఉంటున్న వెంకట్ భారాస ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 14 రోజుల పాటు రిమాండ్కు కూడా వెళ్లారు. టీఎస్పీఎస్సీ పరీక్షల పత్రాల లీకేజీని నిరసిస్తూ ఆయన నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని చేపట్టడంతోపాటు విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బండి సంజయ్ గెలిస్తే సామాన్యుడు గెలిచినట్లే
[ 06-05-2024]
జమ్మికుంటలో భారతీయ జనతా మోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మెళనం నిర్వహించారు. -
పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్
[ 06-05-2024]
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. -
ఆటలు ఆడుకోవాలని ఉంది!
[ 06-05-2024]
‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. -
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?
[ 06-05-2024]
కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా
[ 06-05-2024]
స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. -
క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!
[ 06-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
[ 06-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. -
నిజామాబాద్లోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
భాజపాకు బుద్ధి చెప్పాలి
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన
[ 06-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. -
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని మానుకోవాలి
[ 06-05-2024]
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్ కోరారు. -
చిన్నబోయిన బొంకూర్
[ 06-05-2024]
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. -
పురలో మారిన ముఖచిత్రం
[ 06-05-2024]
గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
[ 06-05-2024]
మండలంలోని కోర్కల్కు చెందిన పూదరి కుమార్(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
అగ్నిగుండం
[ 06-05-2024]
ఈ వేసవి సీజన్లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!