ఈ సారైనా వరదముప్పు తొలగేనా!
కోరుట్ల పట్టణంలోని 10, 11 వార్డుల గుండా ప్రవహించే మద్దుల చెరువు కాలువ ఆక్రమణకు గురికావడంతో ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరదలు కాలనీలను ముంచెత్తున్నాయి
కాలువల ఆక్రమణతో ఏటా ఇళ్లలోకి చేరుతున్న నీరు
పిచ్చిమొక్కలతో నిండిపోయిన కాలువ
న్యూస్టుడే, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని 10, 11 వార్డుల గుండా ప్రవహించే మద్దుల చెరువు కాలువ ఆక్రమణకు గురికావడంతో ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరదలు కాలనీలను ముంచెత్తున్నాయి. 10-15 అడుగుల వెడల్పు గల కాలువ 3-4 అడుగులకు కుచించుకపోవడంతో పదేళ్లుగా ప్రకాశంరోడ్, ఝాన్సీరోడ్లో పూర్తిగా జలమయమవుతున్నాయి. రోడ్లపై వరద ప్రవహించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ అధికారులు వర్షాకాలంలో జలమయమైన కాలనీలను సందర్శిస్తున్నారే తప్పా వరద సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్ స్థలంలోనున్న బొల్లికుంటలో మురుగు నీరు నిల్వ చేరి గుర్రపు డెక్క పెరిగి దుర్గంధం వ్యాపిస్తోంది. చాలా కాలనీలు సిమెంట్రోడ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో కంకర తేలిన రోడ్లపై ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి కాలనీలకు వెళ్లే ప్రకాశంరోడ్లోని సిమెంట్రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఈ రోడ్డుతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
సీసీరోడ్డు నిర్మించాలి..
ప్రధాన సిమెంట్ రోడ్డు దెబ్బతిని కంకరతేలడంతో మూడేళ్లుగా రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నాం. దెబ్బతిన్న రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపితే నడుము నొప్పి భరించలేకపోతున్నాం. సీసీరోడ్డు నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.
- కటుకం రాజేంద్రప్రసాద్, పదో వార్డు
ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు
ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరద నీరు కాలనీలను ముంచెత్తుతుంది. నీరు ఇళ్లలోకి చేరడంతో సరుకులు, వస్తువులు దెబ్బతింటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఇంటిలోంచి బయటకు రాలేకపోతున్నాం. మద్దుల చెరువు వరద ముప్పును నివారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
- పోతు మణెమ్మ 11వ వార్డు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..