పెరుగుతున్న ఔషధ వినియోగం
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.
కొవిడ్ సమయంలో అత్యధికం
కొవిడ్ కన్నా ముందు రూ.5 నుంచి రూ.6 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యేవని స్టోర్స్ అధికారులు తెలిపారు. 2021-22లో కొవిడ్ వల్ల అత్యధిక ఔషధ వినియోగం జరిగింది. ఆ సమయంలో రూ.12.93 కోట్ల విలువైన ఔషధాలు వినియోగించారు. 2022-23 సంవత్సరానికి రూ.6.76 కోట్ల విలువైన మందులు అందించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్ల మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల ఔషధాలు అధికంగా సరఫరా అయ్యాయి.
ఇంటింటికీ సరఫరా
రక్తపోటు, మధుమేహం వంటి వాటితో బాధపడేవారిని వైద్య, ఆరోగ్యశాఖ సర్వే ద్వారా గుర్తిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుర్తించిన వారందరికీ నెల నెలా మాత్రలు ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ద్వారా వీటిని అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ కార్యాలయాలకు పంపిస్తే అక్కడి నుంచి బాధితులకు చేరుస్తారు. క్షయ, కుష్ఠు బాధితులకు కూడా మల్టీ డ్రగ్ థెరపీ విధానంలో ప్రత్యేక కిట్లను అందిస్తారు.
పెద్దాసుపత్రుల్లో ఎక్కువ
ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగుల రాక ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. బోధన ఆసుపత్రుల్లో పలు విభాగాల వైద్యులు అందుబాటులో ఉండటం, వైద్య వసతులు మెరుగు పడటం వల్ల రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఆసుపత్రులకు అభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి. అత్యవసరమైన మందులు కమిటీ ఆమోదంతో కొనుగోలు చేసి వైద్యం అందిస్తున్నారు. కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి ప్రతీ వారానికోసారి, మిగిలిన మూడు జిల్లాల వైద్య కళాశాలల ఆసుపత్రులకు 15రోజులకు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు నెలకోసారి పంపిస్తున్నారు.
రెండు జిల్లాలకు ఒక గోదాము
కరీంనగర్ స్టోర్లో ఔషధ నిల్వలను పరిశీలిస్తున్న సిబ్బంది
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ, మాతాశిశు కేంద్రాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధ వినియోగం పెరుగుతోంది. వచ్చే స్టాక్ నిల్వ చేసేందుకు గోదాములు సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉంది. ఇదేకాకుండా కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద కూడా గోదాము ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త భవనం నిర్మించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆ భవనం ప్రారంభం కాగానే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు జగిత్యాల నుంచి మందులు సరఫరా అవుతాయి. కరీంనగర్, పెద్దపల్లికి కరీంనగర్ నుంచి వెళ్తాయి. ప్రభుత్వం ఏటా కేటాయించిన కోటా ప్రకారం మందులను ఆయా ఆసుపత్రులకు వాహనాల ద్వారా ఏ సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!