పత్తిపాక రిజర్వాయరుతో చివరి ఆయకట్టుకు భరోసా
భారాస అసమర్థ నాయకత్వంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు.
భారాస నిర్లక్ష్యంతోనే ఎండుతున్న పంటలు: మంత్రి శ్రీధర్బాబు
మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఏకత చాటుతున్న ఎమ్మెల్యేలు వివేక్, ప్రేమ్సాగర్రావు, మక్కాన్సింగ్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే మోహన్, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ
ఈనాడు, పెద్దపల్లి: భారాస అసమర్థ నాయకత్వంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. వచ్చే రెండేళ్లలో ధర్మారం మండలం పత్తిపాకలో నిర్మించే రిజర్వాయరుతో ఇక్కడి రైతులకు భరోసా కలుగుతుందన్నారు. పెద్దపల్లిలోని ఓ వేడుకల మందిరంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి, భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఏనాడైనా జిల్లాలోని చివరి ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని అందించేలా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయని, ఈ క్రమంలో మూడు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు చివరి తడి వరకు నీరందించామన్నారు. పెద్దపల్లిలో టాస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పట్టభద్రులకు శిక్షణ అందిస్తామని, విడతల వారీగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. రాజీవ్ రహదారిపై పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో బైపాస్ రహదారులకు నిధుల కేటాయింపు జరిగిందని, ఎన్నికల అనంతరం పనులు ప్రారంభిస్తామన్నారు.
వారివి దొంగ దీక్షలు
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు తమ నియోజకవర్గాలకు తరలిస్తుంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళ్లప్పగించి చూశారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పంటలు ఎండిపోయాయని 36 గంటల దొంగ దీక్షలు చేసిన కొప్పుల, పుట్ట మధూకర్, దాసరి మనోహర్రెడ్డిలు ఏనాడూ చివరి ఆయకట్టుకు నీరందించలేదన్నారు. గతంలో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వకుండా నాటి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి జాప్యం చేశారని, ఎన్నికల తర్వాత పెద్దపల్లిలో 3,500 వరకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు మక్కాన్సింగ్(రామగుండం), ప్రేమ్సాగర్రావు(మంచిర్యాల) గడ్డం వివేక్(చెన్నూరు) మాట్లాడారు. పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, కాంగ్రెస్ నాయకులు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్బాబు ప్రసంగం అనంతరం అప్పన్నపేటకు చెందిన రైతులు ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, సింగిల్విండో ఛైర్మన్లను కాంగ్రెస్లోకి తీసుకోవద్దంటూ కాల్వశ్రీరాంపూర్కు చెందిన సీనియర్ కార్యకర్త సభలో హల్చల్ చేశారు. ‘గోబ్యాక్’ అంటూ నినాదాలు చేయగా మిగిలిన కార్యకర్తలు సముదాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య పలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!