రవాణా శాఖ కార్యాలయంలో సేవలకు అంతరాయం
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సేవలు స్తంభించిపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమన్వయ లోపం.. వాహనదారులకు శాపం
కౌంటర్ల వద్ద బారులు దీరిన వాహనదారులు
న్యూస్టుడే, కరీంనగర్ రవాణా విభాగం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సేవలు స్తంభించిపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా, మరో వైపు గంటల తరబడి వరుసలో నిల్చోవలసి వచ్చింది. కొందరు ఎండను తాళలేక చెట్ల నీడను ఆశ్రయించారు. తిమ్మాపూర్లో పరిధిలో విద్యుత్తు శాఖ అధికారులు చెట్ల కొమ్మలు తొలగించడంతో ఇంటర్నెట్ తీగలు తెగిపోయాయి. ఆర్టీఏ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. వరుస సెలవులు రావడంతో సోమవారం ఆర్టీఏ కార్యాలయానికి వాహనదారులు అధిక మొత్తంలో వచ్చారు. స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన వారు ఇబ్బందులుపడ్డారు.
ఎండలోనే గంటలకొద్దీ..
ఒకవైపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో డ్రైవింగ్ పరీక్ష, వాహనాల రిజిస్ట్రేషన్, పిట్నెస్ పరీక్షల కోసం వచ్చిన వాహనదారులు తాత్కాలిక ట్రాక్ ప్రాంతంలో ఎండలో గంటల కొద్ది వేచి చూశారు. గతంలో డీఎల్ పరీక్షకు వచ్చే అభ్యర్థులు నేరుగా ట్రాక్ వద్దకు వెళ్లి సంబంధిత అధికారికి స్లాట్ బుక్ చేసిన పత్రాలు ఇచ్చి డ్రైవింగ్ చేసేవారు. అలా కాకుండా దస్త్రంపై కౌంటర్ నంబర్ వేయించుకొని వస్తేనే డ్రైవింగ్ చేయాలని సిబ్బంది చెప్పడంతో ఇబ్బందులు పెరిగాయి. కౌంటర్ల వద్ద క్యూలైన్లు నిండిపోవడంతో గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి. అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అధికారులు.. దస్త్రంపై నంబరు వేసే సమయాన్ని పొడిగించారు.
మంత్రి పొన్నం ఆరా..
అంతర్జాల సేవలకు అంతరాయం కల్గిన విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖ కమిషనర్ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సేవలు పునరుద్ధరించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడంతోపాటు వాహనదారులకు ఇబ్బంది కల్గకుండా చూడాలని ఆదేశించారు. డీటీసీ పెద్దింటి పురుషోత్తం కూడా సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి చెట్ల కొమ్మలు తొలగించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం త్వరగా అందుబాటులోకి తెచ్చేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
సిబ్బంది ఇబ్బంది..
ఆర్సీ, డీఎల్ ప్రింట్ తీయడం, ఇతర సేవలకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిలోకి కొందరు ఏజెంట్లతోపాటు ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా వస్తుండటంతో సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కౌంటర్ల వద్ద నివృత్తి చేసుకోవాల్సిన అనుమానాలను కూడా పలువురు కంప్యూటర్ గదిలోకి వచ్చి అడుగుతుండటంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొందని సిబ్బంది వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య పలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
-
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!