ఆలస్యం.. ఆ అభ్యర్థులకు ఉపశమనం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది.
జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అవకాశం
అప్పటికి అనర్హత గడువు పూర్తి కానుండటంతో ఆశావహులకు ఊరట
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది. వీరికి పోటీ చేసే అవకాశం రానుంది. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. జూన్ 3న ఎంపీటీసీ, జులై 4న జడ్పీటీసీల పదవీ ముగియనుంది. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులకు ఆంక్షలు తొలగిపోనున్నాయి.
లెక్కలు చూపకుంటే తిప్పలే
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి పైసాకు లెక్క చూపాల్సిందే. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 జనవరిలో సర్పంచులు, వార్డు సభ్యులు, మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చుల వివరాలను అధికారులకు నివేదించాలి. ఉమ్మడి జిల్లాలో 1,212 పంచాయతీల్లో సర్పంచులు, 12,045 మంది వార్డు సభ్యులు, 52 మంది జడ్పీటీసీలు, 646 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఎంపీడీవోలు అభ్యర్థుల ఖర్చులను లెక్కించి నివేదించారు. ఖర్చుల నివేదికపై అవగాహన లేకపోవడం, మరోసారి పోటీ చేయబోమనే భావన, ఇతరత్రా కారణాలతో చాలా మంది లెక్కలు చూపలేదు. దీంతో 2021లో ఉమ్మడి జిల్లాలో 5,055 మంది అభ్యర్థులపై వేటు వేశారు. ఇందులో సర్పంచి స్థానానికి 410, వార్డు సభ్యులకు 4,228, జడ్పీటీసీ 30, ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసిన 387 మంది అనర్హులుగా ప్రకటించారు.
ఆంక్షలు తొలిగె.. ఆశలు చిగురించే
ఎన్నికల్లో అనర్హత వేటు పడ్డ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే ఆశలు చిగురిస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదు. సర్పంచి, వార్డు సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మే నెలాఖరు వరకు నిషేధం ఉంది. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యంకాదు. షెడ్యూల్ ప్రకారం సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోయేవారు. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రకటన అనర్హత వేటు పడిన అభ్యర్థులకు మరోసారి అదృష్టం కలిసిరానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య పలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
-
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!