కమలం శ్రేణుల్లో కదనోత్సహం
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు.
మోదీ వేములవాడ సభకు భారీ స్పందన
సిరిసిల్ల (ఈనాడు డిజిటల్), వేములవాడ, వేములవాడ గ్రామీణం (న్యూస్టుడే) : ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ లోక్సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు. ప్రధాని రాకకు గంట ముందే సభా ప్రాంగణం నిండిపోగా వందలాది మంది రోడ్లపైనే ఉండిపోయారు. వారందరినీ సభా ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి అనుమతించాలని సభాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పోలీసులను కోరాల్సి వచ్చింది. ప్రధాని మొదట తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అన్నారు.. తరువాత ‘దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు’ అంటూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రసంగం ప్రారంభించారు.
తాను మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశానని, గుజరాత్తో తనకు ఉన్న అనుబంధం తెలిసిందేనని అక్కడ ఎన్నో ఎన్నికలు చూశానని.. కానీ ఇంత పెద్ద ఎత్తున జనం తరలిరావడం ఎన్నడూ చూడలేదన్నారు. మీరందరూ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అన్నారు. ఈ జనసందోహాన్ని చూస్తే బండి సంజయ్ విజయం ఖాయమైందని కితాబిచ్చారు. మోదీ మాటలతో జనం కేరింతలు కొట్టారు. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రసంగంలో కాంగ్రెస్, భారాసలు కేంద్ర ప్రభుత్వంతోపాటు భాజపాపై చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మోహన్రెడ్డి, సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకులుచెన్నమనేని వికాస్రావు, రాణి రుద్రమ, గండ్ర నళిని, ఎర్రం మహేష్, అల్లాడి రమేష్, రేగుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా..
- ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ హుజూరాబాద్, జమ్మికుంటలకు చెందిన భాజపా నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
- హెలిప్యాడ్ నుంచి 9:45 గంటలకు ప్రత్యేక వాహనంలో ఆలయ ఈవో కార్యాలయానికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం నుంచి రాజన్న ప్రధాన ఆలయంలోకి వెళ్లారు. తొలుత కోడెకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని గణపతి, రాజేశ్వరి అమ్మవార్లకు పూజలు చేసి, రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారి స్వామివారి హారతి ఇచ్చారు. అక్కడే స్వామి వారి ఆశీర్వచనం అందించి, శేష వస్త్రం, ప్రసాదం అందించారు.
- 9:55 గంటలకు ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగించుకుని ప్రత్యేక వాహన శ్రేణిలో బాలానగర్లోని సభా ప్రాంగణానికి బయలుదేరారు.
- 10:09 గంటలకు సభా స్థలికి చేరుకుని వేదికపై కలియదిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో జనం ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
- 10:24 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభించి 11.06 గంటలకు ముగించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మోదీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు.
సైడ్లైట్స్
- సభా ప్రాంగణంలో జనం ఇబ్బంది పడకుండా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వారు జనానికి తాగునీరు అందించారు.
- సభా ప్రాంగణం బయట ఉన్నవారు అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలపై మోదీ ప్రసంగాన్ని తిలకించారు.
- సభలో పలుమార్లు జనం ‘భారత్ మాతాకీ జై’ ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు.
- సంజయ్ తన ప్రసంగంలో మా నరేంద్ర మోదీ ఆరు అడుగుల బుల్లెట్టు అనగానే ప్రజలు కేరింతలు కొట్టారు.
మోదీ నాయకత్వంలో అభివృద్ధి
- గోమాసె శ్రీనివాస్, భాజపా పెద్దపల్లి అభ్యర్థి
నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశం కోసం, ధర్మం కోసం, ప్రగతి కోసం నరేంద్రమోదీ కృషి చేస్తున్నారు. నరేంద్రమోదీ ఆలోచన విధానం దేశానికి చాలా అవసరం. భాజపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో ఎన్నుకుని మరోసారి నరేంద్రమోదీని ప్రధాని చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనిపిస్తే కరుస్తున్నాయ్!
[ 20-05-2024]
జిల్లాలో వీధి కుక్కలు బెంబేలేత్తిస్తున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చేవారిపై దాడికి పాల్పడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులుగా తిరుగుతూ బయట ఆడుకునే చిన్నారులతో పాటు వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. రాయికల్ పట్టణంలోని ఓ కాలనీలో ఒకే రోజు 11 మందిపై కుక్కలు దాడి చేశాయి. -
సా..గుతున్న అభివృద్ధి పనులు
[ 20-05-2024]
రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్ను గత ప్రభుత్వం పురపాలక సంఘం హోదా కల్పించి అభివృద్ధి కోసం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లోంచి పెద్ద చెరువుపై మినీ ట్యాంక్బండ్, సమీపంలో ఉద్యానవనం ఏర్పాటుకు రూ.1.5 కోట్లు కేటాయించింది. -
పాఠ్య పుస్తకాలు వస్తున్నాయ్!
[ 20-05-2024]
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతేడాది పంపిణీలో కొంత జాప్యం జరిగింది. -
పెరిగిన మామిడి దిగుబడి.. తగ్గిన ధర
[ 20-05-2024]
రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులకు మామిడి ధర తగ్గింది. ఏడాది పొడవునా కంటికి రెప్పలా చూసుకునే చెట్లు... సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కాతకు సైతం ధర పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. -
పేరుకే పెద్ద ఆసుపత్రి!
[ 20-05-2024]
వైద్య విధాన పరిషత్లో నడుస్తున్న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్య కళాశాలకు అనుసంధానం చేసి ఆరు నెలలైంది. ఇప్పటికీ బడ్జెట్ మంజూరు చేయకపోవడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
[ 20-05-2024]
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 20-05-2024]
వాతావరణంలోని మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లను రూపొందించింది. ప్రధానంగా వర్షాకాలంలో వీటి ఉపయోగం ఎక్కువగా ఉండనుంది. -
సమయం సమీపిస్తున్నా ఏర్పాట్లేవీ!
[ 20-05-2024]
కొండగట్టులో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్ 1న హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మరో పది రోజుల్లో ఉత్సవాలు ప్రారంభంకానున్నా ఆలయంలో ఇంకా ఏర్పాట్లు ప్రారంభంకాలేదు. -
మహిళలకు రక్షణ... వేధింపులకు అడ్డుకట్ట
[ 20-05-2024]
‘ఇటీవల ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వైద్యాధికారిణీలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బెయిల్పై విడుదల చేశారు. -
మహాలక్ష్ములతో ఆర్టీసీ కళకళ
[ 20-05-2024]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులన్నీ కళకళలాడుతుండటంతో ఆదాయమూ పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అయిదు నెలల పరిస్థితిపై ‘న్యూస్టుడే’ కథనం. -
కొత్త రేషన్ కార్డులపై ఆశలు
[ 20-05-2024]
‘రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకే అందిస్తాం. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి సహ ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తాం. -
ప్రధాన రహదారి.. ప్రమాదాలకు నెలవు
[ 20-05-2024]
గౌతమినగర్ నుంచి రాజీవ్ రహదారిని కలిపే ప్రధాన రహదారి నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వెరసి ప్రమాదానికి నెలవుగా మారింది. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి ఎరువులను తీసుకెళ్లే భారీ వాహనాలతో పాటు గోదావరిఖని ప్రాంతం నుంచి ఎన్టీపీసీ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి దగ్గరి దారి కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. -
అర్బన్ బ్యాంక్ ఎన్నికల సన్నాహక సమావేశం
[ 20-05-2024]
సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ బ్యాంక్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అధ్యక్షతన నాయకులు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం అంతంతే
[ 20-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో మద్యం విక్రయాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎన్నికలు అనగానే మద్యం ఏరులై పారుతుంది. కానీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సాధారణంగా జరిగాయి. ఇందుకు ఆబ్కారీశాఖ అధికారుల లెక్కలే ఉదాహరణ. ఎన్నికల కోడ్ మార్చి 16న ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు